ETV Bharat / state

కృష్ణానది ముంపు గ్రామాల్లో అధికారుల పర్యవేక్షణ - Supervision of officials in Krishna Nadi Mumpu villages

కర్ణాటక నుంచి వస్తున్న వరదతోపాటు భీమా నది నీరు కలవటంతో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. ముంపునకు గురి కానున్న 9 గ్రామాల్లో అధికారులు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు.

Supervision of officials in Krishna Nadi Mumpu villages
author img

By

Published : Aug 10, 2019, 8:06 PM IST

నారాయణపేట జిల్లా కృష్ణ నదీతీరంలో 9 ఊర్లను వరద బాధిత గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఊరికో ప్రత్యేక అధికారిని నియమించి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతుండడం వల్ల వాసునగర్, హిందూపూర్, గుర్జాల గ్రామాలను నీరు చుట్టుముట్టాయి. నదీ సమీపానికి ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూపూర్, వాసునగర్, కృష్ణా గ్రామాల వద్ద అధికారులు సమీక్ష నిర్వహించారు. సెలవులు ఉన్నాసరే... అధికారులు అందుబాటులో ఉంటారని ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

కృష్ణానది ముంపు గ్రామాల్లో అధికారుల పర్యవేక్షణ

ఇవీ చూడండి: జూరాలలో కృష్ణమ్మ పరవళ్లు... పోటెత్తిన సందర్శకులు

నారాయణపేట జిల్లా కృష్ణ నదీతీరంలో 9 ఊర్లను వరద బాధిత గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఊరికో ప్రత్యేక అధికారిని నియమించి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతుండడం వల్ల వాసునగర్, హిందూపూర్, గుర్జాల గ్రామాలను నీరు చుట్టుముట్టాయి. నదీ సమీపానికి ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూపూర్, వాసునగర్, కృష్ణా గ్రామాల వద్ద అధికారులు సమీక్ష నిర్వహించారు. సెలవులు ఉన్నాసరే... అధికారులు అందుబాటులో ఉంటారని ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

కృష్ణానది ముంపు గ్రామాల్లో అధికారుల పర్యవేక్షణ

ఇవీ చూడండి: జూరాలలో కృష్ణమ్మ పరవళ్లు... పోటెత్తిన సందర్శకులు

Intro:Tg_mbnr_07_10_Nadhi_varada_munpu_gramalu_Avb_TS10092.
కృష్ణానదికి భీమానది తోడవడంతో ఉప్పొంగిన కృష్ణమ్మ.


Body:నారాయణపేట జిల్లా కృష్ణ నదీతీరంలో మతం తొమ్మిది గ్రామాలను వరద బాధిత గ్రామాలుగా గుర్తించిన అధికారులు తొమ్మిది గ్రామాలకు తొమ్మిది మంది ప్రత్యేక అధికారులను 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద వృద్ధి కొనసాగుతుండడం వల్ల వాసు నగర్, హిందూపూర్, గుర్జాల గ్రామాలకు వరద చుట్టుముట్టాయి నది సమీపానికి ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూపూర్, వాసునగర్, కృష్ణా గ్రామాలవద్ద అధికారులు సమీక్ష నిర్వహించారు. సెలవులు ఉన్న అధికారులు అందుబాటులో ఉంటారని ఆర్ డి ఓ శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యాం నుండి దిగువకు ఐదు లక్షల ముప్పై వేల క్యూసెక్కులు ఉజ్జయిని డ్యామ్ ద్వారా భీమానది దిగువకు సుమారు రెండు లక్షల నలభైఅయిదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా కృష్ణ నదిలో వరద ప్రవాహం సుమారు ఏడు లక్షల యాభై వేల క్యూసెక్కుల వరద నీరు జూరాలకు ప్రవహిస్తుంది. అధికారులు కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్తులను ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.


Conclusion:బైట్స్ :
1) మహదేవ్
2) శివరాజ్ పాటిల్
3) శంకర్
4) సీఐ వెంకట్
5) ఆర్డీవో శ్రీనివాసులు

9959999069,మక్తల్.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.