ETV Bharat / state

భాగ్యనగర వాసులకే సాయం చేస్తారా.. రైతులను పట్టించుకోరా?

author img

By

Published : Oct 24, 2020, 1:51 PM IST

అకాల వర్షానికి నీట మునిగిన పంటకు పరిహారం చెల్లించాలని భాజపా డిమాండ్ చేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

bjp protest demanding compensation for crop loss
నారాయణపేటలో భాజపా నేతల ధర్నా

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా రాష్ట్ర నేత కొండయ్య డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కాషాయ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. మిగిలిన పంటలకైనా మద్దతు ధర ప్రకటించాలని కోరారు.

హైదరాబాద్​లో ఎన్నికలున్నందున వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారని, రైతులను మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కర్ని స్వామి, ఎంపీటీసీ బల్ రాంరెడ్డి, సర్పంచులు లక్ష్మణ్, చేపలి నర్సింహులు, గడ్డం రమేశ్, బాల్చేడ్ మల్లికార్జున్, ఈసరి నాగప్ప పాల్గొన్నారు.

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా రాష్ట్ర నేత కొండయ్య డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కాషాయ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. మిగిలిన పంటలకైనా మద్దతు ధర ప్రకటించాలని కోరారు.

హైదరాబాద్​లో ఎన్నికలున్నందున వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారని, రైతులను మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కర్ని స్వామి, ఎంపీటీసీ బల్ రాంరెడ్డి, సర్పంచులు లక్ష్మణ్, చేపలి నర్సింహులు, గడ్డం రమేశ్, బాల్చేడ్ మల్లికార్జున్, ఈసరి నాగప్ప పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.