నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18వ రోజూ కొనసాగుతోంది. వేకువ జాము నుంచే కార్మికులు పట్టణంలో బస్సు డిపో వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బస్సులను రోడ్లపైకి రానివ్వబోమని అడ్డుకున్నారు. బస్సులు నడిపేందుకు వచ్చిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు.
ఇవీ చూడండి: మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి