ETV Bharat / state

పక్కా వ్యూహం.. ప్రణాళిక ప్రకారం ప్రచారం

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికతో అధికార తెరాస మరోసారి సత్తా చాటింది. జానారెడ్డి .. నోముల భగత్‌.. గట్టి పోటీ అయినా ఇవ్వగలరా అనే.. రాజకీయ పండితుల అనుమానాలను పటాపంచలు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఉపఎన్నికలో రెట్టింపు మెజార్టీతో జయకేతనం ఎగురవేసింది. పక్కా ప్రణాళికతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ సభతో సాగర్‌ ప్రజల విశ్వాసాన్ని మరోసారి చూరగొన్నారు.

author img

By

Published : May 2, 2021, 6:06 PM IST

Updated : May 2, 2021, 9:41 PM IST

trs
టీఆర్​ఎస్​

దుబ్బాక ఉపఎన్నికల ఫలితం తెరాసను కొంత నైరాశ్యంలో పడేసింది. అ తర్వాత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ భాజపా పుంజుకున్న తీరు అధికార పక్షానికి మేల్కోవాలనే సంకేతాలిచ్చింది. అంతా బాగుందనే పరిస్థితి నుంచి తేరుకున్న గులాబీదళం.. అన్ని ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని భావించింది. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అది తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లోనూ సమష్టిగా పనిచేసి విజయదుందుబి మోగించారు. నిరుద్యోగులు, మేధావుల ఓటు బ్యాంకు రాబట్టడం కష్టమే అనే అంచనాలను తలకిందులు చేసి రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లో అభ్యర్థి కరువు అనే పరిస్థితిని తిరగరాసి పీవీ కుమార్తె సురభివాని దేవిని గెలిపించి విపక్షాలకు షాక్‌ ఇచ్చింది. సిట్టింగ్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం మరోసారి పట్టభద్రుడిగా ఎన్నికయ్యారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం.. దుబ్బాక ఉపఎన్నిక అనూహ్య ఓటమి.. జీహెచ్​ఎంసీ ఫలితాల నిస్పృహ నుంచి బయటపడేసింది. ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ ప్రకటన.. నిరుద్యోగ భృతి అమలు చేస్తామనే ప్రకటనలు అధికారపక్షానికి లాభించేలా చేశాయి.

ముఖ్యమంత్రి సభలు

ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపుమీదున్న తెరాస నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలపై దృష్టిపెట్టింది. నోటిఫికేషన్‌కు ముందే ఆ ప్రాంత ప్రజల మనసులు చూరగొనేందుకు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్​ నేరుగా రంగంలోకి దిగారు. నెల్లికల్లుతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాల శ్రీకారం చుట్టారు. సాగర్‌ ప్రాంతాన్ని సస్యశ్యామంలే చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లే నాగార్జునసాగర్‌ చెంతనే ఉన్నా ఇక్కడి భూములు బీళ్లుగా మారాయని బహిరంగ సభతో ఎండగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో జల దోపిడీని కాంగ్రెస్‌ నేతలు అరికట్టలేక పోయారని కేసీఆర్​ మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. రైతు బంధు, బీమా, రుణమాఫీ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం సాగర్‌ నోటిఫికేషన్‌ తర్వాత కూడా మరోసారి హాలియా బహిరంగ సభతో అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్​ భరోసా కల్పించారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి సీఎం దూరంగా ఉండగా ఫలితం చేజారింది. ఈసారి అలాంటి అవకాశానికి తావివ్వకుండా సీఎం కేసీఆర్​ బహిరంగ సభతో భరోసా ఇచ్చారు.

భాజపా ఆరోపణలు

అభ్యర్థి ఎంపికలోనూ తెరాస తర్జనభర్జన పడుతోందనే ప్రచారం జరిగింది. దుబ్బాకలో సోలిపేట సతీమణి పరాభవం చవిచూడగా.. భగత్‌ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు తలెత్తాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నోముల భగత్‌ను బరిలోకి దింపారు. ఈ పరిణామాలపై భాజపా సైతం ఖంగుతిన్నది.. జానారెడ్డిని గెలిపించేందుకు తెరాస పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించింది. మ్యాచ్‌ఫిక్సింగ్‌లో భాగంగా భాజపా బలపడకూదనే జానా విజయానికి తెరాస బాటలు వేస్తోందని మండిపడింది. ఈ ఆరోపణలు, అంచనాలు తలకిందులు చేస్తూ సాగర్‌లో కారు దూసుకెళ్లింది. రాజకీయ ఉద్ధండుడు జానారెడ్డిని..నోముల భగత్‌తో ఢీ కొట్టించి ఓడించింది.

పక్కా వ్యూహం

నోముల భగత్‌ విజయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ పక్కా వ్యూహం రచించారు. నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రతీఓటరును నేరుగా కలిసి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అధికారపక్షం అభ్యర్థిని గెలిపిస్తే సాగర్‌ అభివృద్ధి పరుగులు పెడుతుందని ఓటరులో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఇంట్లోనే ఉండి గెలుద్దామనే జానారెడ్డి సవాల్‌ను తెరాస నేతలు తిప్పికొట్టారు. ఎన్నికల్లోనే ప్రజల మధ్యకు రానంటున్నారని.. గెలిస్తే ఇటువైపే చూడబోరని చురకలంటించారు. అన్ని అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గులాబీ దళం రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ నోముల భగవత్‌ను గెలిపించి మరోసారి జోరు ప్రదర్శించింది.

ఇదీ చదవండి: సాగర్​ ప్రజలకు ధన్యవాదాలు: నోముల భగత్​

దుబ్బాక ఉపఎన్నికల ఫలితం తెరాసను కొంత నైరాశ్యంలో పడేసింది. అ తర్వాత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ భాజపా పుంజుకున్న తీరు అధికార పక్షానికి మేల్కోవాలనే సంకేతాలిచ్చింది. అంతా బాగుందనే పరిస్థితి నుంచి తేరుకున్న గులాబీదళం.. అన్ని ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని భావించింది. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అది తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లోనూ సమష్టిగా పనిచేసి విజయదుందుబి మోగించారు. నిరుద్యోగులు, మేధావుల ఓటు బ్యాంకు రాబట్టడం కష్టమే అనే అంచనాలను తలకిందులు చేసి రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లో అభ్యర్థి కరువు అనే పరిస్థితిని తిరగరాసి పీవీ కుమార్తె సురభివాని దేవిని గెలిపించి విపక్షాలకు షాక్‌ ఇచ్చింది. సిట్టింగ్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం మరోసారి పట్టభద్రుడిగా ఎన్నికయ్యారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం.. దుబ్బాక ఉపఎన్నిక అనూహ్య ఓటమి.. జీహెచ్​ఎంసీ ఫలితాల నిస్పృహ నుంచి బయటపడేసింది. ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ ప్రకటన.. నిరుద్యోగ భృతి అమలు చేస్తామనే ప్రకటనలు అధికారపక్షానికి లాభించేలా చేశాయి.

ముఖ్యమంత్రి సభలు

ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపుమీదున్న తెరాస నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలపై దృష్టిపెట్టింది. నోటిఫికేషన్‌కు ముందే ఆ ప్రాంత ప్రజల మనసులు చూరగొనేందుకు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్​ నేరుగా రంగంలోకి దిగారు. నెల్లికల్లుతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాల శ్రీకారం చుట్టారు. సాగర్‌ ప్రాంతాన్ని సస్యశ్యామంలే చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లే నాగార్జునసాగర్‌ చెంతనే ఉన్నా ఇక్కడి భూములు బీళ్లుగా మారాయని బహిరంగ సభతో ఎండగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో జల దోపిడీని కాంగ్రెస్‌ నేతలు అరికట్టలేక పోయారని కేసీఆర్​ మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. రైతు బంధు, బీమా, రుణమాఫీ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం సాగర్‌ నోటిఫికేషన్‌ తర్వాత కూడా మరోసారి హాలియా బహిరంగ సభతో అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్​ భరోసా కల్పించారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి సీఎం దూరంగా ఉండగా ఫలితం చేజారింది. ఈసారి అలాంటి అవకాశానికి తావివ్వకుండా సీఎం కేసీఆర్​ బహిరంగ సభతో భరోసా ఇచ్చారు.

భాజపా ఆరోపణలు

అభ్యర్థి ఎంపికలోనూ తెరాస తర్జనభర్జన పడుతోందనే ప్రచారం జరిగింది. దుబ్బాకలో సోలిపేట సతీమణి పరాభవం చవిచూడగా.. భగత్‌ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు తలెత్తాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నోముల భగత్‌ను బరిలోకి దింపారు. ఈ పరిణామాలపై భాజపా సైతం ఖంగుతిన్నది.. జానారెడ్డిని గెలిపించేందుకు తెరాస పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించింది. మ్యాచ్‌ఫిక్సింగ్‌లో భాగంగా భాజపా బలపడకూదనే జానా విజయానికి తెరాస బాటలు వేస్తోందని మండిపడింది. ఈ ఆరోపణలు, అంచనాలు తలకిందులు చేస్తూ సాగర్‌లో కారు దూసుకెళ్లింది. రాజకీయ ఉద్ధండుడు జానారెడ్డిని..నోముల భగత్‌తో ఢీ కొట్టించి ఓడించింది.

పక్కా వ్యూహం

నోముల భగత్‌ విజయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ పక్కా వ్యూహం రచించారు. నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రతీఓటరును నేరుగా కలిసి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అధికారపక్షం అభ్యర్థిని గెలిపిస్తే సాగర్‌ అభివృద్ధి పరుగులు పెడుతుందని ఓటరులో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఇంట్లోనే ఉండి గెలుద్దామనే జానారెడ్డి సవాల్‌ను తెరాస నేతలు తిప్పికొట్టారు. ఎన్నికల్లోనే ప్రజల మధ్యకు రానంటున్నారని.. గెలిస్తే ఇటువైపే చూడబోరని చురకలంటించారు. అన్ని అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గులాబీ దళం రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ నోముల భగవత్‌ను గెలిపించి మరోసారి జోరు ప్రదర్శించింది.

ఇదీ చదవండి: సాగర్​ ప్రజలకు ధన్యవాదాలు: నోముల భగత్​

Last Updated : May 2, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.