ETV Bharat / state

'సాగర్​లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం: ఉత్తమ్​

సాగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నారని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్​ 17న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో​ కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డితో ఆయన నివాసంలో ఉత్తమ్​ భేటీ అయ్యారు.

author img

By

Published : Mar 23, 2021, 2:56 AM IST

Telangana PCC president Uttam Kumar Reddy who met Janareddy
'సాగర్​లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం: కాంగ్రెస్​

నాగర్జున సాగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ విజయం ఖాయమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. ఏప్రిల్​ 17న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, సాగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డితో ఆయన నివాసంలో ఉత్తమ్​ భేటీ అయ్యారు.

ఈ నెల 27న హాలియాలో నిర్వహించనున్న 'నాగార్జున సాగర్​ జనగర్జన' బహిరంగ సభను కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉత్తమ్ కుమార్​ రెడ్డి పిలుపునిచ్చారు. సాగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 29న జానారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.

'సాగర్​లో భారీ మోజార్డీతో విజయం సాధిస్తాం: కాంగ్రెస్​

ఇదీ చదవండి: అప్పటి వరకు కేరింతలు.. అంతలోనే ఆర్తనాదాలు

నాగర్జున సాగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ విజయం ఖాయమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. ఏప్రిల్​ 17న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, సాగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డితో ఆయన నివాసంలో ఉత్తమ్​ భేటీ అయ్యారు.

ఈ నెల 27న హాలియాలో నిర్వహించనున్న 'నాగార్జున సాగర్​ జనగర్జన' బహిరంగ సభను కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉత్తమ్ కుమార్​ రెడ్డి పిలుపునిచ్చారు. సాగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 29న జానారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.

'సాగర్​లో భారీ మోజార్డీతో విజయం సాధిస్తాం: కాంగ్రెస్​

ఇదీ చదవండి: అప్పటి వరకు కేరింతలు.. అంతలోనే ఆర్తనాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.