ETV Bharat / state

కిలోమీటర్​ @221 గుంతలు.. ఎక్కడో కాదండోయ్​..!

author img

By

Published : Dec 15, 2022, 8:53 AM IST

Road Damaged in Nakirekal : పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నకిరేకల్‌ పరిస్థితి. పేరుకు నియోజకవర్గ కేంద్రమైనా.. కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ప్రధాన కూడలిలోని తిప్పర్తి రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు అడుగడుగునా గుంతలతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు.

Nakrekal
Nakrekal

Road Damaged in Nakirekal : ఇది ఎక్కడో మారుమూల శివారు గ్రామాలకు వెళ్లే రహదారి కానేకాదు.. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్‌ పురపాలికలోని తిప్పర్తి రోడ్డు ఇది. నిత్యం వేలాది మంది ప్రజలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రహదారిపైనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పురపాలిక కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కూడా ఇదే కావడం గమనార్హం. కిలోమీటరు పొడవునా..221 గుంతలతో అధ్వానంగా మారింది. దీనిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

ద్విచక్రవాహనదారులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల షాక్‌అబ్జర్వర్స్‌ దెబ్బతింటున్నాయని, ఒక సారి వీటిని మార్చితే కారుకు రూ.13 నుంచి 15 వేలు ఖర్చవుతోందని యజమానులు వాపోతున్నారు. నకిరేకల్‌ ప్రధాన కూడలిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి చీమలగడ్డలోని అండర్‌పాస్‌ వంతెన వరకు కిలో మీటరు మేర మాత్రమే దెబ్బతిన్న ఈ రహదారి ఐదేళ్ల నుంచి బీటీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ప్యాచ్‌ వర్క్‌లు కూడా సరిగా చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన దీనిపై గుంతలు పూడ్చే తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

టెండర్లు పిలుస్తాం: కిలోమీటరు మేర ఈ రహదారిపై బీటీ పునరుద్ధరణ కోసం రూ.60 లక్షలతో గడిచిన జూన్‌లో టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. పెరిగిన ఎస్‌ఎస్‌ఆర్‌ ధరలతోపాటు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో తాజాగా రూ.1.80 కోట్లతో కొత్తగా ప్రతిపాదనలు రూపొందించి సాంకేతిక అనుమతుల కోసం పంపాం. వారం పది రోజుల్లో మళ్లీ టెండర్లు పిలిచి మరమ్మతుల పనులు పనులు చేపడతాం. - సంతోశ్‌, ఏఈ ఆర్‌ండ్‌బీ, నకిరేకల్‌

ఇవీ చదవండి:

Road Damaged in Nakirekal : ఇది ఎక్కడో మారుమూల శివారు గ్రామాలకు వెళ్లే రహదారి కానేకాదు.. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్‌ పురపాలికలోని తిప్పర్తి రోడ్డు ఇది. నిత్యం వేలాది మంది ప్రజలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రహదారిపైనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పురపాలిక కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కూడా ఇదే కావడం గమనార్హం. కిలోమీటరు పొడవునా..221 గుంతలతో అధ్వానంగా మారింది. దీనిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

ద్విచక్రవాహనదారులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల షాక్‌అబ్జర్వర్స్‌ దెబ్బతింటున్నాయని, ఒక సారి వీటిని మార్చితే కారుకు రూ.13 నుంచి 15 వేలు ఖర్చవుతోందని యజమానులు వాపోతున్నారు. నకిరేకల్‌ ప్రధాన కూడలిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి చీమలగడ్డలోని అండర్‌పాస్‌ వంతెన వరకు కిలో మీటరు మేర మాత్రమే దెబ్బతిన్న ఈ రహదారి ఐదేళ్ల నుంచి బీటీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ప్యాచ్‌ వర్క్‌లు కూడా సరిగా చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన దీనిపై గుంతలు పూడ్చే తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

టెండర్లు పిలుస్తాం: కిలోమీటరు మేర ఈ రహదారిపై బీటీ పునరుద్ధరణ కోసం రూ.60 లక్షలతో గడిచిన జూన్‌లో టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. పెరిగిన ఎస్‌ఎస్‌ఆర్‌ ధరలతోపాటు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో తాజాగా రూ.1.80 కోట్లతో కొత్తగా ప్రతిపాదనలు రూపొందించి సాంకేతిక అనుమతుల కోసం పంపాం. వారం పది రోజుల్లో మళ్లీ టెండర్లు పిలిచి మరమ్మతుల పనులు పనులు చేపడతాం. - సంతోశ్‌, ఏఈ ఆర్‌ండ్‌బీ, నకిరేకల్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.