ETV Bharat / state

నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసుల కొరడా

author img

By

Published : Apr 16, 2020, 4:40 PM IST

లాక్​ డౌన్ నిబంధనలు పాటించని వ్యక్తులపై... ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎస్పీల పర్యవేక్షణలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో డీసీపీ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. జరిమానా రూపంలో రూ.58 లక్షలు వసూలు చేశారు.

నిబంధనల అతిక్రమణదారులపై పోలీసులు గట్టి చర్యలు
నిబంధనల అతిక్రమణదారులపై పోలీసులు గట్టి చర్యలు

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో... నిబంధనల అతిక్రమణదారులపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 259 కేసులు నమోదు చేయగా... మూడు జిల్లాల పరిధిలో 3 వేల 117 ద్విచక్ర వాహనాల్ని సీజ్ చేశారు. మరో రెండు వందల కార్లు, ఆటోల్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో 14 వందల 80 వాహనాలకు గాను 30 లక్షల 26 వేలు... సూర్యాపేట జిల్లాలో 14 వందల 13 వాహనాలకు 14 లక్షల 80 వేలు రూపాయలు జరిమానా వేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జిల్లాలో 224 ద్విచక్ర వాహనాలపై 12 లక్షల 75 వేల జరిమానా రాబట్టారు. మొత్తంగా మూడు జిల్లాల పరిధిలో 58 లక్షల వరకు జరిమానా రూపంలో వసూలు చేశారు. మోటరు వాహన చట్టం కింద సూర్యాపేట జిల్లాలో 15 వందల 69... యాదాద్రి జిల్లాలో 3 వేల 723 కేసులు నమోదయ్యాయి.

నగదు సాయం రూ.1500 !

జన్ ధన్ ఖాతాలతో పాటు తెల్ల కార్డు ఉన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1500ను చెల్లించింది. వాటిని తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఫలితంగా అన్ని బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంటోంది. భౌతిక దూరం పాటించకపోవడం... మాస్కులు ధరించని తీరుపై వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు చేస్తోంది.

సూర్యాపేటలో హై అలర్ట్...

సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ ప్రాంతాల్లో... హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రస్థాయి అధికార బృందం... జిల్లాలోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. వైద్యారోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న స్క్రీనింగ్​లో... వైరస్ సోకిన వ్యక్తి నేపథ్యం, కుటుంబం, బంధువులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో శోధిస్తున్నారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 8 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. వాటి పరిధిలో 30 వేల వరకు ఇళ్లు ఉండగా... 59 వేల మంది జనాభాపై నిరంతర పరిశీలన కొనసాగుతోంది. జిల్లాలో 23 మందికి గాను... జిల్లా కేంద్రంలో 14 మంది... నాగారం మండలం వర్ధమానుకోటలో 6, తిరుమలగిరిలో 2, నేరేడుచర్లలో ఒకరు వైరస్ బారిన పడ్డారు.

గత 8 రోజుల నుంచి కొత్త కేసులు లేకున్నా... నల్గొండ జిల్లాలోనూ నిరంతర నిఘా కొనసాగుతోంది. నల్గొండ పట్టణంలో 9, దామరచర్లలో 2, మిర్యాలగూడలో ఒక కేసు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని రెడ్ జోన్లపై యంత్రాంగం నజర్ పెట్టింది.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ ముగిశాక కొత్త రూల్స్​ ఇవే...

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో... నిబంధనల అతిక్రమణదారులపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 259 కేసులు నమోదు చేయగా... మూడు జిల్లాల పరిధిలో 3 వేల 117 ద్విచక్ర వాహనాల్ని సీజ్ చేశారు. మరో రెండు వందల కార్లు, ఆటోల్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో 14 వందల 80 వాహనాలకు గాను 30 లక్షల 26 వేలు... సూర్యాపేట జిల్లాలో 14 వందల 13 వాహనాలకు 14 లక్షల 80 వేలు రూపాయలు జరిమానా వేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జిల్లాలో 224 ద్విచక్ర వాహనాలపై 12 లక్షల 75 వేల జరిమానా రాబట్టారు. మొత్తంగా మూడు జిల్లాల పరిధిలో 58 లక్షల వరకు జరిమానా రూపంలో వసూలు చేశారు. మోటరు వాహన చట్టం కింద సూర్యాపేట జిల్లాలో 15 వందల 69... యాదాద్రి జిల్లాలో 3 వేల 723 కేసులు నమోదయ్యాయి.

నగదు సాయం రూ.1500 !

జన్ ధన్ ఖాతాలతో పాటు తెల్ల కార్డు ఉన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1500ను చెల్లించింది. వాటిని తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఫలితంగా అన్ని బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంటోంది. భౌతిక దూరం పాటించకపోవడం... మాస్కులు ధరించని తీరుపై వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు చేస్తోంది.

సూర్యాపేటలో హై అలర్ట్...

సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ ప్రాంతాల్లో... హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రస్థాయి అధికార బృందం... జిల్లాలోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. వైద్యారోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న స్క్రీనింగ్​లో... వైరస్ సోకిన వ్యక్తి నేపథ్యం, కుటుంబం, బంధువులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో శోధిస్తున్నారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 8 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. వాటి పరిధిలో 30 వేల వరకు ఇళ్లు ఉండగా... 59 వేల మంది జనాభాపై నిరంతర పరిశీలన కొనసాగుతోంది. జిల్లాలో 23 మందికి గాను... జిల్లా కేంద్రంలో 14 మంది... నాగారం మండలం వర్ధమానుకోటలో 6, తిరుమలగిరిలో 2, నేరేడుచర్లలో ఒకరు వైరస్ బారిన పడ్డారు.

గత 8 రోజుల నుంచి కొత్త కేసులు లేకున్నా... నల్గొండ జిల్లాలోనూ నిరంతర నిఘా కొనసాగుతోంది. నల్గొండ పట్టణంలో 9, దామరచర్లలో 2, మిర్యాలగూడలో ఒక కేసు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని రెడ్ జోన్లపై యంత్రాంగం నజర్ పెట్టింది.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ ముగిశాక కొత్త రూల్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.