గత 55 రోజులుగా సమ్మె చేస్తున్న నల్గొండ జిల్లాలోని కార్మికులు కేసీఆర్ ప్రకటనతో విధుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నిన్న రాత్రి సీఎం బేషరతుగా కార్మికులు విధుల్లో చేరొచ్చని చెప్పినప్పటి నుంచి కార్మికులకు కంటిమీద కునుకు లేదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు విధుల్లో చేరిపోదామా అన్నట్లు డ్రైవర్లు, కండక్టర్లు వేయి కళ్లతో ఎదురు చూశారు. వేకువ జాము నుంచే డిపోల వద్దకు చేరుకొని ఆనందంగా విధుల్లో చేరిపోయారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు