నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అడవిదేవులపల్లి మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడపిల్లలకు మేనమామగా మారి పెళ్లి కానుకగా లక్ష రూపాయల సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే భాస్కరరావు తెలిపారు. పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని.. ప్రజలందరూ వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి