రాష్ట్రంలోని ఏ ఒక్క ఆడపడుచు బాధపడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కానుకగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని వ్యవసాయ మార్కెట్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మిర్యాలగూడ మండల పరిధిలోని 311 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
కరోనా కష్టకాలంలోనూ మిర్యాలగూడ నియోజకవర్గానికి ఈ పథకం కోసం రూ.ఐదు కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాస్కరరావు కోరారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో మళ్లీ చెలరేగుతూ దడ పుట్టిస్తున్న గొలుసు దొంగలు