ETV Bharat / state

'కరోనా కాలంలోనూ కల్యాణలక్ష్మీ కోసం రూ.5కోట్లు' - మిర్యాలగూడలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో 311మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే భాస్కరరావు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ఆడపడుచు బాధపడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

kalyana-laxmi-cheques-distribution-at-miryalaguda-in-nalgonda-district
'కరోనా కాలంలోనూ కల్యాణలక్ష్మీ కోసం రూ.5కోట్లు'
author img

By

Published : Oct 9, 2020, 1:58 PM IST

రాష్ట్రంలోని ఏ ఒక్క ఆడపడుచు బాధపడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కానుకగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని వ్యవసాయ మార్కెట్​లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​తో కలిసి మిర్యాలగూడ మండల పరిధిలోని 311 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

కరోనా కష్టకాలంలోనూ మిర్యాలగూడ నియోజకవర్గానికి ఈ పథకం కోసం రూ.ఐదు కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాస్కరరావు కోరారు.

రాష్ట్రంలోని ఏ ఒక్క ఆడపడుచు బాధపడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కానుకగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని వ్యవసాయ మార్కెట్​లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​తో కలిసి మిర్యాలగూడ మండల పరిధిలోని 311 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

కరోనా కష్టకాలంలోనూ మిర్యాలగూడ నియోజకవర్గానికి ఈ పథకం కోసం రూ.ఐదు కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాస్కరరావు కోరారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మళ్లీ చెలరేగుతూ దడ పుట్టిస్తున్న గొలుసు దొంగలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.