ETV Bharat / state

హాజీపూర్​ హత్యల కేసు విచారణ జనవరి 3కు వాయిదా - హాజీపూర్​ హత్యల ఘటన విచారణ వాయిదా

హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ జనవరి మూడోతేదీకి వాయిదా పడింది. ముగ్గురు విద్యార్థినుల  హత్యోదంతాలపై విచారణ జరిగింది. నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి... నిందితుడు శ్రీనివాస్​ రెడ్డికి సాక్షుల వాంగ్మూలాలు తెలియజేశారు.

hajipur case has postponed
హాజీపూర్​ వరుస హత్యల కేసు విచారణ జనవరి 3కు వాయిదా
author img

By

Published : Dec 26, 2019, 10:28 PM IST

హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‎రెడ్డి విచారణ జనవరి మూడో తేదీకి వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత విచారణ ప్రారంభించిన కోర్టు... మనీషా కేసులో 44 మంది, శ్రావణి కేసులో 28, కల్పన కేసులో 29, మొత్తంగా 101 మంది సాక్షులు ఉండగా... ఇవాళ కేవలం మనీషా కేసు ప్రక్రియ మాత్రమే పూర్తయింది. జనవరి 3న జరిగే విచారణలో మిగిలిన ఇద్దరి కేసుల్లో వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ సమీపంలోని స్థానికుల వాంగ్మూలాలతోపాటు... పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పేర్కొన్న సారాంశాల్ని శ్రీనివాస్ రెడ్డికి వినిపించారు. శరీర ఆనవాళ్లు లభ్యమైన బావులకు సంబంధించిన యజమానులు, శ్రీనివాస్ రెడ్డి లిఫ్టు మెకానిక్​గా పనిచేసిన సమయంలో నమోదైన హత్య కేసుల వివరాల్ని తెలిపారు.

ఇవాళ జరిగిన విచారణలో భాగంగా నిందితుడి తరఫున ఎవరైన సాక్షులు ఉన్నారా..? అని కోర్టు ప్రశ్నించగా, తమ కుటుంబ సభ్యులను తీసుకొస్తానని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. జనవరి 3న జరిగే విచారణకు సాక్షులను తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇదీ చూడండి: తల్లి మందలించిందని టీనేజ్ యువతి ఆత్మహత్య

హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‎రెడ్డి విచారణ జనవరి మూడో తేదీకి వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత విచారణ ప్రారంభించిన కోర్టు... మనీషా కేసులో 44 మంది, శ్రావణి కేసులో 28, కల్పన కేసులో 29, మొత్తంగా 101 మంది సాక్షులు ఉండగా... ఇవాళ కేవలం మనీషా కేసు ప్రక్రియ మాత్రమే పూర్తయింది. జనవరి 3న జరిగే విచారణలో మిగిలిన ఇద్దరి కేసుల్లో వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ సమీపంలోని స్థానికుల వాంగ్మూలాలతోపాటు... పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పేర్కొన్న సారాంశాల్ని శ్రీనివాస్ రెడ్డికి వినిపించారు. శరీర ఆనవాళ్లు లభ్యమైన బావులకు సంబంధించిన యజమానులు, శ్రీనివాస్ రెడ్డి లిఫ్టు మెకానిక్​గా పనిచేసిన సమయంలో నమోదైన హత్య కేసుల వివరాల్ని తెలిపారు.

ఇవాళ జరిగిన విచారణలో భాగంగా నిందితుడి తరఫున ఎవరైన సాక్షులు ఉన్నారా..? అని కోర్టు ప్రశ్నించగా, తమ కుటుంబ సభ్యులను తీసుకొస్తానని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. జనవరి 3న జరిగే విచారణకు సాక్షులను తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇదీ చూడండి: తల్లి మందలించిందని టీనేజ్ యువతి ఆత్మహత్య

Intro:Body:

Tg_Nlg_04_26_Hatyala_Case_Av_Ts10133_3067451


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.