ఛలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో... నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులను మిర్యాలగూడలో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు లేకుండా చేస్తూ... తుగ్లక్ పాలనను కొనసాగస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వకుంటే రాష్ట్రం వచ్చేదా అంటూ ప్రశ్నించారు. అప్పటి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని... కానీ కేసీఆర్ అది మరచిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి: సరిహద్దు వెంట పాక్ దుశ్చర్య.. భారత జవాను మృతి