ETV Bharat / state

మునుగోడు పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు..​ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్​..

author img

By

Published : Oct 25, 2022, 2:27 PM IST

Collector inspected the polling booths in Munugode: రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉపఎన్నిక కోసం ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మేరకు ఈరోజు నాంపల్లి మండలంలో పోలింగ్​ కేంద్రాలను పరిశీలించిన నల్గొండ కలెక్టర్​ వినయ కృష్ణారెడ్డి.. నియోజక వర్గంలో 105 సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. ఎన్నికల నియమవాళి ప్రకారం 1వ తేదీ వరకు ప్రచారానికి అనుమతి ఉంటుందని ప్రకటించారు.

Collector Vinay Kumar Reddy
Collector Vinay Kumar Reddy

Collector inspected the polling booths in Munugode: మునుగోడు ఉపఎన్నికల పోలింగ్‌ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పోలింగ్‌కు మరో 8రోజులే ఉండటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించగా.. అక్కడ ప్రత్యేక బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నల్గొండ కలెక్టర్‌ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

నాంపల్లిలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ కేంద్రంలోని గదుల్లో ఫర్నీచర్‌, లైటింగ్‌, వెబ్‌క్యాస్టింగ్‌తో పాటు సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్రాలన్నీ పోలింగ్‌ కోసం సిద్ధమవుతాయన్న ఆయన.. ఒకటో తేదీ సాయంత్రం 6లోగా స్థానికేతరులంతా నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పారు.

"ఈరోజు నాంపల్లి మండలంలోని అన్ని పోలింగ్​ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ప్రతి పోలింగ్​ కేంద్రంలో ప్రకాశవంతమైన లైటింగ్​లు, సిబ్బందికి అసౌకర్యం కలగకుండా ఫ్యాన్​లు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజక వర్గంలో 105 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించటం జరిగింది. అన్ని చోట్ల ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తాం. ఎన్నికల నియమవాళి ప్రకారం 1వ తేదీ సాయంత్రం ఆరుగంటల తరువాత ప్రచారం నిలిపివేస్తాం. ఆ సమయానికి స్థానికేతరులంతా నియోజకవర్గం నుంచి బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుది".- వినయ్​కుమార్​రెడ్డి, నల్గొండ కలెక్టర్​

మునుగోడులో పోలింగ్​ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​.. 1వ తేదీ వరకే ప్రచారం

ఇవీ చదవండి:

Collector inspected the polling booths in Munugode: మునుగోడు ఉపఎన్నికల పోలింగ్‌ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పోలింగ్‌కు మరో 8రోజులే ఉండటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించగా.. అక్కడ ప్రత్యేక బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నల్గొండ కలెక్టర్‌ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

నాంపల్లిలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ కేంద్రంలోని గదుల్లో ఫర్నీచర్‌, లైటింగ్‌, వెబ్‌క్యాస్టింగ్‌తో పాటు సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్రాలన్నీ పోలింగ్‌ కోసం సిద్ధమవుతాయన్న ఆయన.. ఒకటో తేదీ సాయంత్రం 6లోగా స్థానికేతరులంతా నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పారు.

"ఈరోజు నాంపల్లి మండలంలోని అన్ని పోలింగ్​ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ప్రతి పోలింగ్​ కేంద్రంలో ప్రకాశవంతమైన లైటింగ్​లు, సిబ్బందికి అసౌకర్యం కలగకుండా ఫ్యాన్​లు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజక వర్గంలో 105 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించటం జరిగింది. అన్ని చోట్ల ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తాం. ఎన్నికల నియమవాళి ప్రకారం 1వ తేదీ సాయంత్రం ఆరుగంటల తరువాత ప్రచారం నిలిపివేస్తాం. ఆ సమయానికి స్థానికేతరులంతా నియోజకవర్గం నుంచి బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుది".- వినయ్​కుమార్​రెడ్డి, నల్గొండ కలెక్టర్​

మునుగోడులో పోలింగ్​ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​.. 1వ తేదీ వరకే ప్రచారం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.