నల్గొండ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. చిట్యాల మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీ శివారులో గుట్టు చప్పుడు కాకుండా క్షుద్రపూజలు చేస్తున్న ఇద్దరిని
స్థానికులు గుర్తించారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో క్షుద్రపూజలకు ఉపయోగించే సామాగ్రి, మహిళల వస్త్రాలు పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ వేళ వైభవంగా మాజీ సీఎం కుమారుడి వివాహం!