ETV Bharat / state

తొలిరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఒకే నామినేషన్​ - ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రోజు కేవలం ఒక్కరు నామినేషన్

వచ్చేనెల 14న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి రోజు కేవలం ఒక్కరు మాత్రమే నామినేషన్​ దాఖలు చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్​ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నల్గొండ జిల్లాలో బండారు నాగరాజు నామినేషన్​ పత్రం సమర్పించారు.

graduate mlc nomination today in nalgonda
నామినేషన్​ పత్రాన్ని కలెక్టర్​కు అందజేస్తున్న స్వతంత్ర అభ్యర్థి
author img

By

Published : Feb 16, 2021, 6:42 PM IST

నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలిరోజు నల్గొండ జిల్లాలో ఒక్క నామినేషన్​ మాత్రమే నమోదైంది. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు నామినేషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​కు అందజేశారు.

నల్గొండ స్థానానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వ్యవహరించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్​ తెలిపారు. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ గడువున్నట్లు వెల్లడించారు. మార్చి 14న పోలింగ్.. 17న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి : 'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్'.. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు

నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలిరోజు నల్గొండ జిల్లాలో ఒక్క నామినేషన్​ మాత్రమే నమోదైంది. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు నామినేషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​కు అందజేశారు.

నల్గొండ స్థానానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వ్యవహరించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్​ తెలిపారు. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ గడువున్నట్లు వెల్లడించారు. మార్చి 14న పోలింగ్.. 17న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి : 'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్'.. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.