నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. పోటీల్లో 5 జిల్లాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో నారాయణపేట జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, బాలుర నుంచి నాగర్ కర్నూల్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. పోటీల్లో గెలిపొందిన వారికి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి బహుమతులు అందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: 'చంపుతామని బెదిరిస్తున్నారు... భద్రత కల్పించండి...'