ETV Bharat / state

టీఎస్​యూటీఎఫ్​ రక్తదాన శిబిరం విజయవంతం - Ambedkar Jayanthi Celebrations Kalvakurthi

టీఎస్​యూటీఎఫ్​ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో భాగంగా చేపట్టిన రక్తదాన శిబిరంలో ఉపాధ్యాయులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు.

టీఎస్​యూటీఎఫ్​ రక్తదాన శిబిరం
టీఎస్​యూటీఎఫ్​ రక్తదాన శిబిరం
author img

By

Published : Apr 15, 2020, 11:57 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్​ ( టీఎస్​యూటీఎఫ్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. తొలుత​​ స్థానిక పురపాలిక​ ఛైర్మన్​ ఎడ్మ సత్యం, సీఐ సైదులు, టీఎస్​యూటీఎఫ్​ సభ్యులు అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తలసేమియాతో బాధపడే వారిని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు టీఎస్​యూటీఎఫ్​ సభ్యులు తెలిపారు. లాక్​డౌన్ కొనసాగుతున్నందున పురపాలికలో పనిచేసే 90 మంది కార్మికులకు లక్ష రూపాయలతో నిత్యావసర సరుకులను కొనుగోలు చేసినట్లు వారు చెప్పారు.

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్​ ( టీఎస్​యూటీఎఫ్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. తొలుత​​ స్థానిక పురపాలిక​ ఛైర్మన్​ ఎడ్మ సత్యం, సీఐ సైదులు, టీఎస్​యూటీఎఫ్​ సభ్యులు అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తలసేమియాతో బాధపడే వారిని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు టీఎస్​యూటీఎఫ్​ సభ్యులు తెలిపారు. లాక్​డౌన్ కొనసాగుతున్నందున పురపాలికలో పనిచేసే 90 మంది కార్మికులకు లక్ష రూపాయలతో నిత్యావసర సరుకులను కొనుగోలు చేసినట్లు వారు చెప్పారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.