ETV Bharat / state

Lockdown: నాగర్​ కర్నూల్​లో పకడ్బందీగా లాక్​డౌన్

author img

By

Published : May 29, 2021, 4:36 PM IST

నాగర్ కర్నూల్ జిల్లాలో లాక్​డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్​ పోస్టులు ఏర్పాటు చేసి.. విధులు నిర్వహిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు పెడుతూ... వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.

police strictly implemented lockdwon in nagar kurnool district
నాగర్ కర్నూల్లో పకడ్బందీగా అమలవుతున్న లాక్డౌన్

నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసులు లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు పరుస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో పలు చోట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ పట్టణంలోకి అనుమతించట్లేరు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా, బస్టాండు కూడలి, హౌసింగ్ బోర్డ్, చెరువు కట్ట, బస్ డిపోల వద్ద ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అలాగే బిజినేపల్లి, తిమ్మాజీ పేట, తెలకపల్లి, తాడూరు శివార్లలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. లాక్​డౌన్ సడలింపు సమయం దాటాక బయటి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు పెడుతున్నారు. వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసులు లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు పరుస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో పలు చోట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ పట్టణంలోకి అనుమతించట్లేరు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా, బస్టాండు కూడలి, హౌసింగ్ బోర్డ్, చెరువు కట్ట, బస్ డిపోల వద్ద ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అలాగే బిజినేపల్లి, తిమ్మాజీ పేట, తెలకపల్లి, తాడూరు శివార్లలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. లాక్​డౌన్ సడలింపు సమయం దాటాక బయటి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు పెడుతున్నారు. వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.