నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న శ్మశాన వాటికను కొందరు ధ్వంసం చేశారు. ఈ విషయంపై సర్పంచ్ వెంకటస్వామి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
గ్రామస్థులందరి సహకారంతో శ్మశాన వాటికని నిర్మించాలని ఎంపీడీవో శర్మ సూచించారు. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు. గ్రామంలోని వైరాల వల్ల అభివృద్ధి పథకాలు కుంటుపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష