ETV Bharat / state

తెరాస-భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ, లాఠీ ఛార్జ్

పుర పాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్​ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఘర్షణ చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య తోపులాట గొడవ చిలికి చిలికి లాఠీఛార్జ్​ వరకు కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్​ చుగ్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో శాసనసభ్యుడు గువ్వల బాలరాజు వాహనం అక్కడకు రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

author img

By

Published : Apr 24, 2021, 9:20 PM IST

Updated : Apr 24, 2021, 10:46 PM IST

achampet nagar kurnool telangana, Clash between trs BJP activities
తెరాస-భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ, లాఠీ ఛార్జ్
తెరాస-భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ, లాఠీ ఛార్జ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస-భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ, లాఠీ ఛార్జ్​కి దారి తీసింది. నాగర్​ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్​ చుగ్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుపై ఛార్జ్​ షీట్ విడుదల చేశారు. అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న శాసనసభ్యుడు గువ్వల బాలరాజు వాహనం వచ్చింది. వాహనానికి అడ్డుతొలగాలంటూ తెరాస కార్యకర్తలు భాజపా కార్యకర్తలను నెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేశారు.

ఈ ఘటనలో ఆరుగురు భాజపా కార్యకర్తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో స్వల్ఫ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సహా తెరాస తీరును నిరసిస్తూ భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.

స్థానిక ఎంఎల్ఏ ప్రోద్భలంతోనే పోలీసులు తమ కార్యకర్తలపై దాడి చేశారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. గాయపడిన భాజపా కార్యకర్తలను జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దాడిచేసిన తెరాస కార్యకర్తలపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి : కరీంనగర్ జిల్లాలో ఆక్సిజన్‌, బెడ్స్, ఇంజక్షన్లపై ప్రత్యేక నిఘా

తెరాస-భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ, లాఠీ ఛార్జ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస-భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ, లాఠీ ఛార్జ్​కి దారి తీసింది. నాగర్​ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్​ చుగ్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుపై ఛార్జ్​ షీట్ విడుదల చేశారు. అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న శాసనసభ్యుడు గువ్వల బాలరాజు వాహనం వచ్చింది. వాహనానికి అడ్డుతొలగాలంటూ తెరాస కార్యకర్తలు భాజపా కార్యకర్తలను నెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేశారు.

ఈ ఘటనలో ఆరుగురు భాజపా కార్యకర్తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో స్వల్ఫ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సహా తెరాస తీరును నిరసిస్తూ భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.

స్థానిక ఎంఎల్ఏ ప్రోద్భలంతోనే పోలీసులు తమ కార్యకర్తలపై దాడి చేశారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. గాయపడిన భాజపా కార్యకర్తలను జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దాడిచేసిన తెరాస కార్యకర్తలపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి : కరీంనగర్ జిల్లాలో ఆక్సిజన్‌, బెడ్స్, ఇంజక్షన్లపై ప్రత్యేక నిఘా

Last Updated : Apr 24, 2021, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.