ETV Bharat / state

అయోధ్య రామమందిర కరసేవకులకు సన్మానం

author img

By

Published : Dec 20, 2020, 8:17 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణ పనుల్లో కరసేవకు వెళ్లిన వారికి సన్మానం చేశారు. నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పురపాలికలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ayodhya servants appreciation programme in nagar kurnool dist kalwakurthy muncipality
అయోధ్య రామమందిర కరసేవకులకు సన్మానం

అయోధ్య రామమందిరం కరసేవకులకు సన్మానం చేయడం సంతోషంగా ఉందని జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. నాగర్​కర్నూల్ కల్వకుర్తి పురపాలికలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ ప్రాంతానికి చెందిన వారు గతంలో ఇంటికి ఒకరు కర సేవకు వెళ్లేవారని, కరసేవకులుగా పనిచేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలన్నారు. హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ మత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, ఆర్ఎస్ఎస్, భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఫామ్‌హౌస్‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దు: బండి సంజయ్​

అయోధ్య రామమందిరం కరసేవకులకు సన్మానం చేయడం సంతోషంగా ఉందని జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. నాగర్​కర్నూల్ కల్వకుర్తి పురపాలికలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ ప్రాంతానికి చెందిన వారు గతంలో ఇంటికి ఒకరు కర సేవకు వెళ్లేవారని, కరసేవకులుగా పనిచేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలన్నారు. హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ మత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, ఆర్ఎస్ఎస్, భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఫామ్‌హౌస్‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.