ETV Bharat / state

భానుడు  @ 45 డిగ్రీల సెల్సియస్‌ - high temperatures in jangaon district

సూర్యుడు సుర్రుమంటున్నాడు..  ఉగ్రరూపం దాల్చుతున్నాడు. నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.. ప్రజలను భయపెడుతున్నాడు.. మొన్నటి వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి రోడ్ల మీదకు ఎవరూ రావ్వొద్దని చెప్పింది.. ఇప్పుడు భానుడు కర్ఫ్యూ విధిస్తున్నాడు. ఎవరూ బయటకు రాకుండా చేస్తున్నాడు.

very high temperatures in warangal district
భానుడు  @ 45 డిగ్రీల సెల్సియస్‌
author img

By

Published : May 22, 2020, 8:54 AM IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు నమోదైంది. ప్రజలు విలవిల్లాడుతున్నారు. కాలు తీసి బయట పెట్టలేకపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇటీవల కొన్ని చోట్ల కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. తిరిగి ఒక్కసారిగా భానుడు భగభగమంటున్నాడు.

ఎండాకాలం ఆరంభం నుంచి మార్చి, ఏప్రిల్‌ నెలలు దాదాపుగా లాక్‌డౌన్‌ ఉండటంతో ప్రజలు బయటకు రాలేదు. కానీ లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కానీ ఎండలు ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేకపోతున్నారు. వేడిమితో పాటుగా వడగాలులు సైతం వీస్తున్నాయి. దీంతో మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని నీడపట్టునే ఉంటే మంచిది. లేకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది ప్రాణాలకే ప్రమాదం. వీలయినంతగా నీడపట్టునే ఉండాలి. బయటకు వెళితే గొడుగు పట్టుకుని వెళ్లాలి. శరీరంలో నీటినిల్వలను తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులను ధరించాలి. ఎండకు వెళ్లి వచ్చి తర్వాత శరీరం సహకరించకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సిఎస్‌)

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు నమోదైంది. ప్రజలు విలవిల్లాడుతున్నారు. కాలు తీసి బయట పెట్టలేకపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇటీవల కొన్ని చోట్ల కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. తిరిగి ఒక్కసారిగా భానుడు భగభగమంటున్నాడు.

ఎండాకాలం ఆరంభం నుంచి మార్చి, ఏప్రిల్‌ నెలలు దాదాపుగా లాక్‌డౌన్‌ ఉండటంతో ప్రజలు బయటకు రాలేదు. కానీ లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కానీ ఎండలు ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేకపోతున్నారు. వేడిమితో పాటుగా వడగాలులు సైతం వీస్తున్నాయి. దీంతో మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని నీడపట్టునే ఉంటే మంచిది. లేకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది ప్రాణాలకే ప్రమాదం. వీలయినంతగా నీడపట్టునే ఉండాలి. బయటకు వెళితే గొడుగు పట్టుకుని వెళ్లాలి. శరీరంలో నీటినిల్వలను తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులను ధరించాలి. ఎండకు వెళ్లి వచ్చి తర్వాత శరీరం సహకరించకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సిఎస్‌)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.