ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట, రామంజపూర్, కేశాపూర్, పాపయ్యపల్లెలో ముంపునకు గురైన పంటపొలాలను జడ్పీ ఛైర్పర్సన్ కుసుమ జగదీశ్వర్ పరిశీలించారు. మునిగిన పంట పొలాలు వద్దకు వ్యవసాయ అధికారులను పిలిపించారు.
పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అన్నదాతలు ఆవేదనకు గురికావొద్దని చెప్పారు. వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇప్పంచి... రైతులను ఆదుకుంటామని ఛైర్ పర్సన్ హామీ ఇచ్చారు.