ETV Bharat / state

భక్తజన సందోహం: ముందే వచ్చిన 'మహా జాతర'

author img

By

Published : Jan 14, 2020, 6:37 AM IST

Updated : Jan 14, 2020, 8:40 AM IST

జాతరకు ఇంకా మూడు వారాల సమయం ఉండగానే మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి సెలవులు కూడా తోడుకావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు.. మేడారం బాట పడుతున్నారు. జంపన్న పరిసరాలు కూడా జనసంద్రంగా మారుతున్నాయి. ఇటు మేడారం మహాజాతరకు  జరిగే  పనులపై  సమీక్షించిన  మంత్రి  సత్యవతి రాఠోడ్.. రెండు మూడు రోజులకోసారి వచ్చి పరిశీలిస్తానని పేర్కొన్నారు.

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తుల రాక క్రమంగా పెరుగుతోంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వచ్చి వన దేవతలను దర్శించుకుంటున్నారు. జాతర సమయంలో రద్దీగా ఉంటుందని.. దర్శనం సరిగ్గా కాదన్న భావనతో ముందుగానే మేడారానికి విచ్చేస్తున్నారు. ప్రతి బుధవారం, ఆదివారాల్లో రద్దీ ఎక్కువైతోంది. సంక్రాంతి సెలువులు కూడా కావడం వల్ల రెండు రోజుల నుంచి మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి.. గద్దెల వైపు కదులుతున్నారు. అమ్మల దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పసుపు కుంకుమలతో పూజలు చేసి.. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణతో పాటు తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయడం వల్ల మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి.

గడువు పెంచేది లేదు:

మేడారానికి విచ్చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్.. జాతర పనులపై మరోసారి సమీక్షించారు. జంపన్నవాగు దగ్గర ఏర్పాట్లు, తాగునీటి వసతి, కల్యాణ కట్టలు , మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. జాతర తేదీలు దగ్గరపడుతున్నందున.. పనులు వేగంగా చేయాలంటూ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతోందని.. అధికారులంతా మేడారంలోనే ఉండి.. పనులను ముమ్మరం చేయాలని తెలిపారు. ఇక గడవు పెంచేది లేదని... తరచూ వచ్చి జాతర పనులను సమీక్షిస్తానని చెప్పారు.

పనుల నాణ్యత విషయంలో కూడా రాజీపడేదీ లేదని మంత్రి హెచ్చరించారు. దేవాదాయ శాఖ తరఫున భక్తులందరికీ అమ్మవారి ప్రసాదంగా బంగారం ఇవ్వాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: గోదావరి, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తుల రాక క్రమంగా పెరుగుతోంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వచ్చి వన దేవతలను దర్శించుకుంటున్నారు. జాతర సమయంలో రద్దీగా ఉంటుందని.. దర్శనం సరిగ్గా కాదన్న భావనతో ముందుగానే మేడారానికి విచ్చేస్తున్నారు. ప్రతి బుధవారం, ఆదివారాల్లో రద్దీ ఎక్కువైతోంది. సంక్రాంతి సెలువులు కూడా కావడం వల్ల రెండు రోజుల నుంచి మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి.. గద్దెల వైపు కదులుతున్నారు. అమ్మల దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పసుపు కుంకుమలతో పూజలు చేసి.. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణతో పాటు తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయడం వల్ల మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి.

గడువు పెంచేది లేదు:

మేడారానికి విచ్చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్.. జాతర పనులపై మరోసారి సమీక్షించారు. జంపన్నవాగు దగ్గర ఏర్పాట్లు, తాగునీటి వసతి, కల్యాణ కట్టలు , మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. జాతర తేదీలు దగ్గరపడుతున్నందున.. పనులు వేగంగా చేయాలంటూ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతోందని.. అధికారులంతా మేడారంలోనే ఉండి.. పనులను ముమ్మరం చేయాలని తెలిపారు. ఇక గడవు పెంచేది లేదని... తరచూ వచ్చి జాతర పనులను సమీక్షిస్తానని చెప్పారు.

పనుల నాణ్యత విషయంలో కూడా రాజీపడేదీ లేదని మంత్రి హెచ్చరించారు. దేవాదాయ శాఖ తరఫున భక్తులందరికీ అమ్మవారి ప్రసాదంగా బంగారం ఇవ్వాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: గోదావరి, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం

sample description
Last Updated : Jan 14, 2020, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.