ETV Bharat / state

అంకన్నగూడెంలో వెలిసిన మావోయిస్టు కరపత్రాలు

author img

By

Published : Jun 24, 2020, 9:02 AM IST

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామసమీపంలో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వాటిని తొలగించారు.

Maoist pamphlets found in Mulugu district
అంకన్నగూడెంలో వెలిసిన మావోయిస్టు కరపత్రాలు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామ సమీపంలో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. అడవి భూములపై అటవీశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో చేస్తున్నా దాడులను వెంటనే నిలిపివేయాలని, ఆదివాసీలు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కరపత్రాలతో వారు డిమాండ్​ చేశారు.

ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు తీర్పును రద్దు చేయాలని, సుప్రీం రద్దు చేసిన జీవో నెంబర్​ 3ను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. కరపత్రాలను చూసి రాజకీయ నాయకులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామ సమీపంలో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. అడవి భూములపై అటవీశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో చేస్తున్నా దాడులను వెంటనే నిలిపివేయాలని, ఆదివాసీలు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కరపత్రాలతో వారు డిమాండ్​ చేశారు.

ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు తీర్పును రద్దు చేయాలని, సుప్రీం రద్దు చేసిన జీవో నెంబర్​ 3ను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. కరపత్రాలను చూసి రాజకీయ నాయకులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.