ETV Bharat / state

ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నా: గవర్నర్‌

author img

By

Published : Feb 19, 2022, 4:31 PM IST

Updated : Feb 19, 2022, 5:03 PM IST

Governor Tamilisai Visits Medaram: మేడారం మహాజాతరను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సందర్శించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నానని గవర్నర్​ తెలిపారు.

ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నా: గవర్నర్‌
ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నా: గవర్నర్‌
ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నా: గవర్నర్‌

Governor Tamilisai Visits Medaram: ములుగు జిల్లా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాది మంది ప్రజలు వనదేవతల దర్శనానికి బారులు తీరారు. మేడారం మహాజాతరను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సందర్శించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్డు మార్గంలో మేడారం జాతర చేరుకున్న గవర్నర్‌కు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఘనస్వాగతం పలికారు.

ప్రజలకు ఐశ్వర్యం కలగాలి..

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్​.. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలకు ఐశ్వర్యం కలగాలని ఆమె ఆకాంక్షించారు. వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆదివాసీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొన్న గవర్నర్​.. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. పోషకాహార సమస్య పరిష్కారం కోసం చిక్కీలు, మహబూబా లడ్డూలు పంపిణీ చేశామన్నారు. మేడారం జాతరలోని భక్తులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని కోరుకున్నారు. గిరిజనుల జీవనాన్ని చూసేందుకే రోడ్డుమార్గంలో వచ్చినట్లు గవర్నర్​ తమిళిసై స్పష్టం చేశారు.

అధికారులపై గవర్నర్​ అసంతృప్తి

మేడారం జాతరలో అధికారులపై గవర్నర్‌ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను వచ్చినప్పుడు భక్తులను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో కలిసి గద్దెలు దర్శించుకోవాలన్నది తన ఆకాంక్ష అని గవర్నర్‌ పేర్కొన్నారు. అందరినీ కలిసేందుకే హెలికాప్టర్‌లో రాకుండా రోడ్డుమార్గంలో వచ్చానన్నారు. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బంది కలిగినందుకు మన్నించాలన్నారు.

అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి..

తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నా. అమ్మవారి దయతో ప్రజలకు ఐశ్వర్యం కలగాలి. వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఆదివాసీల్లో పోషకాహార సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా. మేడారం జాతర భక్తులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి. గిరిజనుల జీవనాన్ని చూసేందుకు రోడ్డుమార్గంలో వచ్చాను.

-తమిళిసై సౌందరరాజన్​, గవర్నర్​

ఇదీ చదవండి:

ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నా: గవర్నర్‌

Governor Tamilisai Visits Medaram: ములుగు జిల్లా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాది మంది ప్రజలు వనదేవతల దర్శనానికి బారులు తీరారు. మేడారం మహాజాతరను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సందర్శించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్డు మార్గంలో మేడారం జాతర చేరుకున్న గవర్నర్‌కు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఘనస్వాగతం పలికారు.

ప్రజలకు ఐశ్వర్యం కలగాలి..

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్​.. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలకు ఐశ్వర్యం కలగాలని ఆమె ఆకాంక్షించారు. వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆదివాసీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొన్న గవర్నర్​.. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. పోషకాహార సమస్య పరిష్కారం కోసం చిక్కీలు, మహబూబా లడ్డూలు పంపిణీ చేశామన్నారు. మేడారం జాతరలోని భక్తులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని కోరుకున్నారు. గిరిజనుల జీవనాన్ని చూసేందుకే రోడ్డుమార్గంలో వచ్చినట్లు గవర్నర్​ తమిళిసై స్పష్టం చేశారు.

అధికారులపై గవర్నర్​ అసంతృప్తి

మేడారం జాతరలో అధికారులపై గవర్నర్‌ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను వచ్చినప్పుడు భక్తులను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో కలిసి గద్దెలు దర్శించుకోవాలన్నది తన ఆకాంక్ష అని గవర్నర్‌ పేర్కొన్నారు. అందరినీ కలిసేందుకే హెలికాప్టర్‌లో రాకుండా రోడ్డుమార్గంలో వచ్చానన్నారు. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బంది కలిగినందుకు మన్నించాలన్నారు.

అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి..

తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నా. అమ్మవారి దయతో ప్రజలకు ఐశ్వర్యం కలగాలి. వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఆదివాసీల్లో పోషకాహార సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా. మేడారం జాతర భక్తులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి. గిరిజనుల జీవనాన్ని చూసేందుకు రోడ్డుమార్గంలో వచ్చాను.

-తమిళిసై సౌందరరాజన్​, గవర్నర్​

ఇదీ చదవండి:

Last Updated : Feb 19, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.