ETV Bharat / state

మోసగాళ్ల అరెస్టు... నకిలీ బంగారం, గంజాయి స్వాధీనం - ganjai muta arrest in mulugu

ములుగు జిల్లా పాలంపేటలో నకిలీ బంగారం, వజ్రాలు అమ్ముతామని ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ బంగారం, వజ్రాలు, డమ్మీ పిస్తోల్​, గంజాయి, సెల్​ఫోన్​లు, 10 లక్షల నగదు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మోసగాళ్ల అరెస్టు... నకిలీ బంగారం, గంజాయి స్వాధీనం
author img

By

Published : Nov 19, 2019, 6:05 PM IST

ములుగు జిల్లాలో నకిలీ బంగారం, వజ్రాలు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం పాలంపేట సమీపంలోని ఇబ్రహీం బాబా ఫౌల్ట్రీ ఫాంలో... గంజాయి ఉందనే సమాచారంతో సిబ్బందితో కలిసి ఎస్సై నరహరి తనిఖీ చేశారు. గంజాయితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇబ్రహీం బాబా అనే వ్యక్తి తక్కువ ధరకే బంగారం, వజ్రాలు కిలోల చొప్పున అమ్ముతానని నమ్మించి ప్రజల నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ బంగారం ఇచ్చారని నిలదీస్తే... తుపాకీతో బెదిరించినట్లు వివరించారు. నిందితులు వీరన్న, రవిచందర్​ను అదుపులోకి తీసుకోగా... ఇబ్రహీం, తిరుపతి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి 110కిలోల గంజాయి, ఒక డమ్మీ పిస్తోల్​, కారు, ఆరు సెల్​ఫోన్లు, నకిలీ డైమండ్స్​, బంగారం, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

మోసగాళ్ల అరెస్టు... నకిలీ బంగారం, గంజాయి స్వాధీనం

ఇవీ చూడండి : కిడ్నాప్​ కేస్​ - నాన్న ఫోన్​ నెంబర్​ గుర్తుంది.. కాల్​ చేశా..!

ములుగు జిల్లాలో నకిలీ బంగారం, వజ్రాలు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం పాలంపేట సమీపంలోని ఇబ్రహీం బాబా ఫౌల్ట్రీ ఫాంలో... గంజాయి ఉందనే సమాచారంతో సిబ్బందితో కలిసి ఎస్సై నరహరి తనిఖీ చేశారు. గంజాయితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇబ్రహీం బాబా అనే వ్యక్తి తక్కువ ధరకే బంగారం, వజ్రాలు కిలోల చొప్పున అమ్ముతానని నమ్మించి ప్రజల నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ బంగారం ఇచ్చారని నిలదీస్తే... తుపాకీతో బెదిరించినట్లు వివరించారు. నిందితులు వీరన్న, రవిచందర్​ను అదుపులోకి తీసుకోగా... ఇబ్రహీం, తిరుపతి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి 110కిలోల గంజాయి, ఒక డమ్మీ పిస్తోల్​, కారు, ఆరు సెల్​ఫోన్లు, నకిలీ డైమండ్స్​, బంగారం, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

మోసగాళ్ల అరెస్టు... నకిలీ బంగారం, గంజాయి స్వాధీనం

ఇవీ చూడండి : కిడ్నాప్​ కేస్​ - నాన్న ఫోన్​ నెంబర్​ గుర్తుంది.. కాల్​ చేశా..!

Intro:tg_wgl_52_18_ganjai_smaglarlanu_pattivetha_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట కు పోయే రహదారి ప్రక్కన సబ్ స్టేషన్ దగ్గర ఇబ్రహీం బాబా పౌల్ట్రీ ఫార్మ్ లో గంజాయి ఉన్నదనే సమాచారం మేరకు ఉదయం అం సిబ్బందితో కలిసి ఎస్ ఐ నరహరి ఇబ్రహీం బాబా పౌల్ట్రీ లో తనిఖీ చేయగా ఒక తెల్లని సంచులు గంజాయి తో పాటు ఇంటి వద్ద ముగ్గురు వ్యక్తులు ఉండగా వారిని పట్టుకొని విచారించారు. ఇబ్రహీం బాబా అనే వ్యక్తి తక్కువ ధరకే బంగారం అమ్ముతా మని ప్రజల్ని మోసం చేస్తూ వారి వద్ద లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నాడని ఇదేంటి నకిలీ బంగారం ఇచ్చి మోసం చేస్తున్నావని అడిగితే అతని వద్దనున్న డమ్మీ పిస్టోల్ తో బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఎస్పి సాయి చైతన్య అన్నారు. కిలోల చొప్పున బంగారం వజ్రాలు ఇస్తామని నమ్మించి వారిని మోసం చేస్తున్నాడని, నకిలీ బంగారం, నకిలీ వజ్రాలు ఇచ్చే వ్యక్తి తిరుపతి పరారయ్యాడు. నిందితులు నలుగురిలో ముగ్గురు హిబ్రహీం బాబా ములుగు జిల్లా కేంద్రం గడిగడ్డ వీధి, దొంతగాని వీరన్న కోళ్ల ఫామ్ లో గుమస్తా, నక్క రవిచందర్ ములుగు, మరో వ్యక్తి తిరుపతి పరారీలో ఉన్నారని ఆయన అన్నారు. వీరి వద్ద అ 110 కిలోల గంజాయి, ఒక డమ్మీ పిస్తోల్, కారు, ఆరు సెల్ఫోన్లు, నకిలీ డైమండ్స్, నకిలీ బంగారం గడ్డలు, లక్ష పదివేల రూపాయలు చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కు పంపిస్తున్నామని అన్నారు.


Body:ss


Conclusion:బైట్ : సాయి చైతన్య ఏ ఎస్పీ ములుగు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.