ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో భక్తులు సమ్మక్క, సారలమ్మలను పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. నాలుగో బుధవారం తిరుగువారం కావడం వల్ల రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి... జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేశారు.
తలనీలాలు సమర్పించుకుని అమ్మవార్ల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకున్నారు. ఒడి బియ్యం పసుపు, కుంకుమ నూతన వస్త్రాలతో అమ్మవార్లకు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చూడండి: తుపాకులు పట్టిన జవానుల చేతుల్లో చీపుర్లు