ETV Bharat / state

రేవంత్​రెడ్డిపై పోలీసులకు BRS నేతల ​ఫిర్యాదు.. యాత్రను అడ్డుకుంటామని వార్నింగ్

author img

By

Published : Feb 8, 2023, 9:37 AM IST

Updated : Feb 8, 2023, 9:56 AM IST

BRS Leaders Complaint against Revanth Reddy : రేవంత్​రెడ్డిపై ములుగు బీఆర్ఎస్ నేతలు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ప్రగతి భవన్​పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేసినందు వల్లే ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. ఇది పునరావృతమైన యాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను హెచ్చరించారు.

Revanth Reddy
Revanth Reddy

BRS Leaders Complaint against Revanth Reddy : ప్రగతిభవన్​పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై​ ములుగు బీఆర్ఎస్ నేతలు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రేవంత్​రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. నిన్న ములుగులో పాదయాత్రలో భాగంగా తెలంగాణ ప్రగతికి చిహ్నమైన ప్రగతిభవన్​ను గ్రానైట్స్​తో పేల్చేయాలంటూ రేవంత్​రెడ్డి సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Revanth Reddy Padayatra in mulugu : ప్రగతిభవన్​పై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి పిలుపునిచ్చారు. ఒక పార్లమెంట్​ సభ్యుడుగా ఉండి పరిపాలనా భవనం, తెలంగాణ ప్రగతికి చిహ్నమైన "ప్రగతిభవన్" ను గ్రానైట్స్​తో పేల్చేయమనటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

నాడు నక్సలిజాన్ని నిషేధించింది కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ నేడు నక్సలైట్లతో ప్రగతిభవన్​ను గ్రానైట్​తో పేల్చేయండి.. అనడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థిస్తారా..? అని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్​రెడ్డిపై పీడీ యాక్ట్ క్రింద కేసు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నమని తెలిపారు. ఇది పునరావృతమైతే పాదయాత్రను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ములుగు జిల్లాలో రేవంత్ రెడ్డి నిర్వహించిన 'హాథ్‌ సే హాథ్‌ జోడో' యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజు రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని యాత్ర ప్రారంభించారు. రామప్ప శిల్ప కళాకృతులను వీక్షించి అనంతరం ముందుకు కదిలారు. రామప్ప నుంచి వెంకటాపురం మండలం నర్సాపూర్ వరకు.. అక్కడి నుంచి ములుగు వరకు పాదయాత్ర చేశారు.

రైతులు, కూలీలతో మాట్లాడి వారి కష్ట సుఖాలు అడిగి తెలుకున్నారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ములుగు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో మంగళవారం రోజున పాల్గొన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలర్పించింది.. కేసీఆర్ కుటుంబం బాగుపడడం కోసమేనా అని ప్రశ్నించారు.

ప్రగతిభవన్‌లో పేదలకు చోటు లేదని, నక్సలైట్లు పేల్చేసినా నష్టం లేదని పేర్కొన్నారు. పేదవాడి కడుపు నింపడమే అభివృద్ధి తప్ప భవనాలు నిర్మించడం కాదని అన్నారు. 2024లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్న రేవంత్‌రెడ్డి.. జనవరి 1న సమ్మక్క సారలమ్మ జిల్లా జీవో తీసుకొస్తామని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి 'హాథ్‌ సే హాథ్‌ జోడో' యాత్ర ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో జరగనుంది. పెనుగొండలో ప్రారంభమై మహబూబాబాద్ వరకు సాగనుంది.

ఇవీ చదవండి:

BRS Leaders Complaint against Revanth Reddy : ప్రగతిభవన్​పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై​ ములుగు బీఆర్ఎస్ నేతలు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రేవంత్​రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. నిన్న ములుగులో పాదయాత్రలో భాగంగా తెలంగాణ ప్రగతికి చిహ్నమైన ప్రగతిభవన్​ను గ్రానైట్స్​తో పేల్చేయాలంటూ రేవంత్​రెడ్డి సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Revanth Reddy Padayatra in mulugu : ప్రగతిభవన్​పై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి పిలుపునిచ్చారు. ఒక పార్లమెంట్​ సభ్యుడుగా ఉండి పరిపాలనా భవనం, తెలంగాణ ప్రగతికి చిహ్నమైన "ప్రగతిభవన్" ను గ్రానైట్స్​తో పేల్చేయమనటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

నాడు నక్సలిజాన్ని నిషేధించింది కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ నేడు నక్సలైట్లతో ప్రగతిభవన్​ను గ్రానైట్​తో పేల్చేయండి.. అనడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థిస్తారా..? అని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్​రెడ్డిపై పీడీ యాక్ట్ క్రింద కేసు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నమని తెలిపారు. ఇది పునరావృతమైతే పాదయాత్రను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ములుగు జిల్లాలో రేవంత్ రెడ్డి నిర్వహించిన 'హాథ్‌ సే హాథ్‌ జోడో' యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజు రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని యాత్ర ప్రారంభించారు. రామప్ప శిల్ప కళాకృతులను వీక్షించి అనంతరం ముందుకు కదిలారు. రామప్ప నుంచి వెంకటాపురం మండలం నర్సాపూర్ వరకు.. అక్కడి నుంచి ములుగు వరకు పాదయాత్ర చేశారు.

రైతులు, కూలీలతో మాట్లాడి వారి కష్ట సుఖాలు అడిగి తెలుకున్నారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ములుగు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో మంగళవారం రోజున పాల్గొన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలర్పించింది.. కేసీఆర్ కుటుంబం బాగుపడడం కోసమేనా అని ప్రశ్నించారు.

ప్రగతిభవన్‌లో పేదలకు చోటు లేదని, నక్సలైట్లు పేల్చేసినా నష్టం లేదని పేర్కొన్నారు. పేదవాడి కడుపు నింపడమే అభివృద్ధి తప్ప భవనాలు నిర్మించడం కాదని అన్నారు. 2024లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్న రేవంత్‌రెడ్డి.. జనవరి 1న సమ్మక్క సారలమ్మ జిల్లా జీవో తీసుకొస్తామని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి 'హాథ్‌ సే హాథ్‌ జోడో' యాత్ర ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో జరగనుంది. పెనుగొండలో ప్రారంభమై మహబూబాబాద్ వరకు సాగనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 8, 2023, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.