ETV Bharat / state

ఎమ్మెల్యే వివేకానంద క్షమాపణలు చెప్పారు: తహసీల్దార్ల సంఘం

author img

By

Published : Oct 7, 2020, 8:29 PM IST

రెవెన్యూ ఉద్యోగిని దుర్బాషలాడిన ఘటనలో ఎమ్మెల్యే వివేకానంద క్షమాపణలు చెప్పినట్లు రాష్ట్ర తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు రవీందర్​, కార్యదర్శి గౌతమ్​ తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై.. బాధితుల ఫిర్యాదుతో వీఆర్వోపై.. ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు నిరసనలకు సిద్ధమవుతున్న వేళ.. వారికి క్షమాపణలు చెప్పారు.. ఎమ్మెల్యే వివేకానంద.

MLA Vivekananda apologized
ఎమ్మెల్యే వివేకానంద క్షమాపణలు చెప్పారు: తహసీలార్ల సంఘం

రెవెన్యూ ఉద్యోగులపై ఫోన్​లో దుర్భాషలాడిన కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానంద.. వారికి క్షమాపణలు చెప్పారు. దుండిగల్​ తహసీల్దార్​ కార్యాలయంలో తహసీల్దార్ల సంఘం ప్రతినిధులతో భేటీ అయిన ఎమ్మెల్యే.. క్షమాపణలు కోరినట్లు రాష్ట్ర ఎమ్మార్వోల సంఘం అధ్యక్షుడు రవీందర్​, కార్యదర్శి గౌతమ్​ తెలిపారు.

మూడు రోజుల క్రితం కుత్బుల్లాపూర్​ మండలం గాజులరామారం సర్వే నంబర్​ 79 అక్రమ నిర్మాణాలు వెలిశాయంటూ.. వాటిని కూల్చేశారు. కుత్బుల్లాపూర్​ తహసీల్దార్​ ఆదేశాలతో.. తెల్లవారుజామున గాజులరామారం వీఆర్వో శ్యామ్​ కుమార్​ అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. వారి ఇంట్లోని విద్యుత్​ మీటర్లను తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వివేకానంద దృష్టికి తీసుకెళ్లారు బాధితులు. ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. సదరు వీఆర్వోపై ఫోన్లో దుర్భాషలాడారు. ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీస్​ స్టేషన్​లో ఎమ్మెల్యేపై.. వీఆర్వో శ్యామ్​ ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలకు తహసీల్దార్ల సంఘం సిద్ధమైంది.

ఇవాళ.. దుండిగల్​ తహసీల్దార్​ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే వివేకానంద... సదరు ఘటనపై విచారం వ్యక్తం చేశారని.. క్షమాపణలు కోరినట్లు రాష్ట్ర తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు రవీందర్​, కార్యదర్శి గౌతమ్​ తెలిపారు.

ఇవీచూడండి: వైరల్​గా మారిన ఎమ్మెల్యే ఫోన్​ సంభాషణ

రెవెన్యూ ఉద్యోగులపై ఫోన్​లో దుర్భాషలాడిన కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానంద.. వారికి క్షమాపణలు చెప్పారు. దుండిగల్​ తహసీల్దార్​ కార్యాలయంలో తహసీల్దార్ల సంఘం ప్రతినిధులతో భేటీ అయిన ఎమ్మెల్యే.. క్షమాపణలు కోరినట్లు రాష్ట్ర ఎమ్మార్వోల సంఘం అధ్యక్షుడు రవీందర్​, కార్యదర్శి గౌతమ్​ తెలిపారు.

మూడు రోజుల క్రితం కుత్బుల్లాపూర్​ మండలం గాజులరామారం సర్వే నంబర్​ 79 అక్రమ నిర్మాణాలు వెలిశాయంటూ.. వాటిని కూల్చేశారు. కుత్బుల్లాపూర్​ తహసీల్దార్​ ఆదేశాలతో.. తెల్లవారుజామున గాజులరామారం వీఆర్వో శ్యామ్​ కుమార్​ అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. వారి ఇంట్లోని విద్యుత్​ మీటర్లను తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వివేకానంద దృష్టికి తీసుకెళ్లారు బాధితులు. ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. సదరు వీఆర్వోపై ఫోన్లో దుర్భాషలాడారు. ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీస్​ స్టేషన్​లో ఎమ్మెల్యేపై.. వీఆర్వో శ్యామ్​ ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలకు తహసీల్దార్ల సంఘం సిద్ధమైంది.

ఇవాళ.. దుండిగల్​ తహసీల్దార్​ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే వివేకానంద... సదరు ఘటనపై విచారం వ్యక్తం చేశారని.. క్షమాపణలు కోరినట్లు రాష్ట్ర తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు రవీందర్​, కార్యదర్శి గౌతమ్​ తెలిపారు.

ఇవీచూడండి: వైరల్​గా మారిన ఎమ్మెల్యే ఫోన్​ సంభాషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.