ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్​ రెండో డోసు కోసం ఆరోగ్య కేంద్రాల వద్ద జనం బారులు

author img

By

Published : May 11, 2021, 3:54 PM IST

కరోనా వ్యాక్సిన్​ రెండో డోసు కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఉదయం నుంచే లైన్లలో నిల్చుని.. వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. గురువారం నుంచి ఆన్​లైన్​లో స్లాట్​ బుక్​ చేసుకున్న వారికే వ్యాక్సిన్​ వేస్తామని ప్రకటించడంతో ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు.

రెండో డోసు కోసం జనం బారులు
రెండో డోసు కోసం జనం బారులు

మేడ్చల్ జిల్లా కాప్రా, మల్కాజిగిరి, కీసర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలు బారులుతీరారు. కరోనా వ్యాక్సిన్​ రెండో డోస్ కోసం ఉదయం నుంచే లైన్లలో నిలబడి టీకా వేయించుకుంటున్నారు.

45 ఏళ్లు పైబడిన వారికి ఆన్​లైన్​లో స్లాట్​ బుక్​ చేసుకోకుండానే ఈ బుధవారం వరకు వ్యాక్సిన్​ వేస్తుండటంతో అధిక సంఖ్యలో జనాలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలివస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్​ టీకాలు అందుబాటులో ఉన్నాయని.. రోజూ దాదాపు వెయ్యి మందికి పైగా వాక్సిన్లు వేస్తున్నామని వైద్యులు తెలిపారు.

మేడ్చల్ జిల్లా కాప్రా, మల్కాజిగిరి, కీసర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలు బారులుతీరారు. కరోనా వ్యాక్సిన్​ రెండో డోస్ కోసం ఉదయం నుంచే లైన్లలో నిలబడి టీకా వేయించుకుంటున్నారు.

45 ఏళ్లు పైబడిన వారికి ఆన్​లైన్​లో స్లాట్​ బుక్​ చేసుకోకుండానే ఈ బుధవారం వరకు వ్యాక్సిన్​ వేస్తుండటంతో అధిక సంఖ్యలో జనాలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలివస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్​ టీకాలు అందుబాటులో ఉన్నాయని.. రోజూ దాదాపు వెయ్యి మందికి పైగా వాక్సిన్లు వేస్తున్నామని వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి.. 'ఎన్నికల వల్లే ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందిందనడం వాస్తవం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.