విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి ప్రాణాలు కోల్పోయిన బాలుడు మేడ్చల్ జిల్లా ఏ.ఎస్.రావునగర్ లోని అరుల్ కాలనీ ప్లే గ్రౌండ్లో 8వ తరగతి చదువుతున్న బాలుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. పురుషోత్తం(13) ఆడుకుంటుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో షాక్ కొట్టింది. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని కుషాయిగూడ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.ఇవీ చూడండి ;'అల్పాహారంలో బొద్దింక.. హోటల్ సీజ్'