ETV Bharat / state

స్వయంగా సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారి చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : May 28, 2020, 4:46 PM IST

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తమ పరిధిలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సొంత నిధులతో స్వయంగా సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారి చేశారు.

Medchal District latest news
Medchal District latest news

లాక్​డౌన్ మొదలైన నాటి నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీల్లో తమ సొంత నిధులతో సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వెల్లడించారు. గురువారం మేడ్చల్​ జిల్లా అల్వాల్ వెంకటాపురం డివిజన్​లోని పలు కాలనీల్లో​ స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారి చేశారు.

రాష్ట్ర సర్కారు కరోనా మహమ్మారి నివారణ కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్​డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

లాక్​డౌన్ మొదలైన నాటి నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీల్లో తమ సొంత నిధులతో సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వెల్లడించారు. గురువారం మేడ్చల్​ జిల్లా అల్వాల్ వెంకటాపురం డివిజన్​లోని పలు కాలనీల్లో​ స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారి చేశారు.

రాష్ట్ర సర్కారు కరోనా మహమ్మారి నివారణ కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్​డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.