మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్తో కలిపి మరో అయిదు గ్రామ పంచాయతీలు మల్లంపేట్, బౌరంపేట, డి-పోచంపల్లి, బహదూర్ పల్లి, గాగిల్లాపూర్తో కలిసి దుండిగల్ మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపల్ పరిధిలోని 28 వార్డులను ఏర్పాటు చేయగా 66 పోలింగ్ బూత్లను అధికారులు సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 47 వేల 504 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ వెల్లడించారు. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల నియమావళిపై శిక్షణ ఇచ్చామని.. ఎన్నికల సామగ్రిని, లెక్కింపు కేంద్రం కోసం బౌరంపేటలోని డీఆర్కే కళాశాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పబ్జీ ద్వారా అమ్మాయిని వేధించిన సల్మాన్ ఖాన్