సైబరాబాద్ పోలీసులు జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్లో నిర్బంధ తనిఖీలు చేశారు. స్థానికుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు తనిఖీలు చేశారు. 9మంది అనుమానితులు, సరైనపత్రాలు లేని 52 ద్విచక్రవాహనాలు, 2 కార్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బాలానగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో సుమారు 90 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం యాదవ్ అన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపడుతున్నామని తెలిపారు.
ఇదీ చూడండి : పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి...