మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పేట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో గత కొంతకాలంగా బెట్టింగ్ (చిత్తు-బొత్తు)కు పాల్పడుతున్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.44 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
కొంపల్లిలోని దొంతి శ్రీనివాస్ ఇంట్లో గత కొంతకాలంగా పలువురు బెట్టింగ్కు పాల్పడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, పేట్-బషీరాబాద్ పోలీసులు దాడులు జరిపారు. చిత్తు బొత్తు ఆట ఆడుతూ బెట్టింగ్లు కాస్తున్న 42 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'!