మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ వాంబే నివాస సముదాయాల్లో ఓ పేద కుటుంబం ఉంటోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కరోనా కారణంగా పని లేకపోవడంతో భార్యాభర్తలు తమ పెద్ద కుమార్తెను తీసుకొని పటాన్చెరులోని ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లారు. చిన్న కుమార్తెను, ఆమె అమ్మమ్మను ఇంటి దగ్గర ఉంచారు. వేసవి కావటం ఉక్కపోస్తుందని రాత్రి చిన్నారి, వృద్ధురాలు బయట పడుకున్నారు.
ఇదే ప్రాంతానికి చెందిన నిందితుడు అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చి ఆ చిన్నారి నోరు మూసేసి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అలికిడికి పక్కింటిలో ఉంటున్న బాలిక బంధువు బయటకి వచ్చి ఇక్కడేం చేస్తున్నావని ప్రశ్నించడం వల్ల అక్కడ నుంచి పరారయ్యాడు. గదిలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు.