లాక్డౌన్ సడలింపు వల్ల మెదక్ జిల్లాలో సాధారణ పరిస్థితి నెలకొంది. గత 58 రోజులుగా నిలిచిపోయిన వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. మూడు విడతల లాక్డౌన్ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలించి రవాణా, వ్యాపార సముదాయాలకు అనుమతి ఇవ్వడం వల్ల మెదక్ జిల్లాతో పాటు.. పలు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లాలోని అన్నీ మండల కేంద్రాల్లో, గ్రామాల్లో దుకాణాలు పూర్తిగా తెరుచుకున్నాయి.
ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. తొలిరోజు 40 బస్సులు మెదక్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, సిద్దిపేట, చేగుంటతో పాటు పలు రూట్లలో తిరిగాయి. 58 రోజులుగా ఇళ్లకే పరిమితమైన జనాలు బస్సులు, వాహనాల రాకపోకలు మొదలు కావడం వల్ల రోడ్ల మీదకు వచ్చారు. రోడ్లు, దుకాణాలు కిటకిటలాడాయి.
ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'