మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద రెండు రోజులుగా వాననీరు నిలిచిపోయాయి. 5 మోటర్ల సహాయంతో నీటిని ఎత్తి పోశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే రహదారిపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.జాతీయ రహదారి నుంచి వాహనాలను గ్రామాల మీదుగా ఉన్న చిన్న రహదారుల గుండా మళ్లించారు. బ్రిడ్జ్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్, జాతీయ రహదారుల పీడీ తరుణ్ పర్యవేక్షించారు.
ఇదీ చూడండి: రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు