ETV Bharat / state

దుబ్బాక నిధులను మామా, అల్లుళ్లు సిద్దిపేటకు ఎత్తుకుపోవడం అలవాటైపోయింది : రేవంత్​రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 3:13 PM IST

PCC Chief Revanth Reddy Participated Congress Meeting at Dubbaka : దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుళ్లకు అలవాటైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఉపఎన్నికల్లో గెలిచిన రఘునందన్​రావు ఏం చేసిండు.. కొత్త ప్రభాకర్​ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు.

PCC Chief Revanth Reddy
PCC Chief Revanth Reddy Participated Congress Meeting at Dubbaka

PCC Chief Revanth Reddy Participated Congress Meeting at Dubbaka : పదేళ్లలో కేసీఆర్​ కుటుంబం బంగారుమయంగా మారింది తప్ప.. తెలంగాణను బొండాలగడ్డగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) ధ్వజమెత్తారు. దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుళ్లకు అలవాటైపోయిందని అన్నారు. మెదక్​ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.

దుబ్బాక నియోజకవర్గ నిధులను కేసీఆర్​ సిద్దిపేటకు తరలించకుండా చెరుకు ముత్యం రెడ్డి కొట్లాడిండు అని.. గతంలో కాంగ్రెస్​(Congress) హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని రేవంత్​రెడ్డి అన్నారు. అలాగే కేంద్రం నుంచి నిధులు తెచ్చి రఘునందన్​రావు దుబ్బాకను అభివృద్ధి చేస్తానని చెప్పి.. మూడేళ్లు గడిచినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఆయనకు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. ఈ ప్రాంతానికి రూ.10 వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఆయనకు ఆ హక్కు ఉండేదని చెప్పారు. పార్టీ రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉండు తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి- ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి: రేవంత్​రెడ్డి

Telangana Elections 2023 : కొత్త ప్రభాకర్​ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాత చింతకాయ పచ్చడే అంటూ రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్​.. ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ చేయలేదని ప్రశ్నించారు. అలాగే నిధులు ఎందుకు తెప్పించుకోలేకపోయారని.. పీజీ కాలేజీ ఎందుకు తీసుకురాలేకపోయారని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఎంపీగా ఉన్న ప్రభాకర్​రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేం లేదని మండిపడ్డారు. కేసీఆర్(KCR)​ గడిలో పెద్ద జీతగాడిలా.. బంట్రోతులా పని చేశారు తప్ప.. దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.

Revanth Reddy Fires on BRS : ఈ పదేళ్లలో రఘునందన్​, కొత్త ప్రభాకర్​ రెడ్డిని చూశారు.. ఇక వాళ్లను చూడాల్సిందేమీ లేదు.. నీతికి, నిజాయతీకి మారుపేరు చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్​ రెడ్డిని గెలిపించాలని దుబ్బాక ప్రజలను కోరారు. పదేళ్లలో కేసీఆర్​ కుటుంబం బంగారుమయంగా మారింది తప్ప.. తెలంగాణను బొండాలగడ్డగా మార్చారని రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్​ బక్కోడు కాదు.. బకాసురుడు.. ఫామ్​హౌస్​లో పడుకునే కుంభకర్ణుడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. ఆరు గ్యారెంటీ(Congress Six Guarentees)లు కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేసీఆర్​కు చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​రూం కట్టించడం ఖాయం.. దోచుకున్నది కక్కించడం ఖాయమని రేవంత్​రెడ్డి తెలిపారు.

రాష్ట్ర శాసనసభ సమరంలో హోరాహోరీ - ప్రచారంతో కదం తొక్కిన బంధుజనం

కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదలందరికి ఇళ్లు వస్తాయి : రేవంత్‌రెడ్డి

PCC Chief Revanth Reddy Participated Congress Meeting at Dubbaka : పదేళ్లలో కేసీఆర్​ కుటుంబం బంగారుమయంగా మారింది తప్ప.. తెలంగాణను బొండాలగడ్డగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) ధ్వజమెత్తారు. దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుళ్లకు అలవాటైపోయిందని అన్నారు. మెదక్​ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్​ విజయభేరి సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.

దుబ్బాక నియోజకవర్గ నిధులను కేసీఆర్​ సిద్దిపేటకు తరలించకుండా చెరుకు ముత్యం రెడ్డి కొట్లాడిండు అని.. గతంలో కాంగ్రెస్​(Congress) హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని రేవంత్​రెడ్డి అన్నారు. అలాగే కేంద్రం నుంచి నిధులు తెచ్చి రఘునందన్​రావు దుబ్బాకను అభివృద్ధి చేస్తానని చెప్పి.. మూడేళ్లు గడిచినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఆయనకు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. ఈ ప్రాంతానికి రూ.10 వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఆయనకు ఆ హక్కు ఉండేదని చెప్పారు. పార్టీ రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉండు తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి- ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి: రేవంత్​రెడ్డి

Telangana Elections 2023 : కొత్త ప్రభాకర్​ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాత చింతకాయ పచ్చడే అంటూ రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్​.. ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ చేయలేదని ప్రశ్నించారు. అలాగే నిధులు ఎందుకు తెప్పించుకోలేకపోయారని.. పీజీ కాలేజీ ఎందుకు తీసుకురాలేకపోయారని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఎంపీగా ఉన్న ప్రభాకర్​రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేం లేదని మండిపడ్డారు. కేసీఆర్(KCR)​ గడిలో పెద్ద జీతగాడిలా.. బంట్రోతులా పని చేశారు తప్ప.. దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.

Revanth Reddy Fires on BRS : ఈ పదేళ్లలో రఘునందన్​, కొత్త ప్రభాకర్​ రెడ్డిని చూశారు.. ఇక వాళ్లను చూడాల్సిందేమీ లేదు.. నీతికి, నిజాయతీకి మారుపేరు చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్​ రెడ్డిని గెలిపించాలని దుబ్బాక ప్రజలను కోరారు. పదేళ్లలో కేసీఆర్​ కుటుంబం బంగారుమయంగా మారింది తప్ప.. తెలంగాణను బొండాలగడ్డగా మార్చారని రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్​ బక్కోడు కాదు.. బకాసురుడు.. ఫామ్​హౌస్​లో పడుకునే కుంభకర్ణుడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. ఆరు గ్యారెంటీ(Congress Six Guarentees)లు కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేసీఆర్​కు చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​రూం కట్టించడం ఖాయం.. దోచుకున్నది కక్కించడం ఖాయమని రేవంత్​రెడ్డి తెలిపారు.

రాష్ట్ర శాసనసభ సమరంలో హోరాహోరీ - ప్రచారంతో కదం తొక్కిన బంధుజనం

కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదలందరికి ఇళ్లు వస్తాయి : రేవంత్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.