ETV Bharat / state

కేంద్రాన్నిచెడుగా చూపించేందుకు తెరాస ప్రయత్నం: రఘునందన్​ - నర్సాపూర్​లో రెస్టారెంట్​ను ప్రారంభించిన రఘునందన్​రావు

అణగారిన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం చివరి వరకు పోరాడతాని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్​ పట్టణ సమీపంలో టీరెడ్‌పోర్టు రెస్టారెంట్​ను ఆయన ప్రారంభించారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో తెరాస ప్రభుత్వం కేంద్రాన్ని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

mla raghunanadan rao opend a restaurant in medak district
నర్సాపూర్​లో రెస్టారెంట్​ను ప్రారంభించిన రఘునందన్​రావు
author img

By

Published : Mar 27, 2021, 2:50 AM IST

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. తద్వారా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో లబ్ధిపొందాలని తెరాస ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపుర్​ పట్టణ సమీపంలో టీరెడ్‌పోర్టు రెస్టారెంట్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శాసన సభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు సభాపతికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజవర్గం పరిధిలో తాను లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసిన పంచాయతీరాజ్ ఎస్‌ఈ అధికారిపై ఫోన్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అణగారిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం చివరివరకు పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ భాజపా ఇంఛార్జి సింగాయపల్లి గోపి, కౌన్సిలర్‌ సునీతా బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. తద్వారా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో లబ్ధిపొందాలని తెరాస ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపుర్​ పట్టణ సమీపంలో టీరెడ్‌పోర్టు రెస్టారెంట్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శాసన సభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు సభాపతికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజవర్గం పరిధిలో తాను లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసిన పంచాయతీరాజ్ ఎస్‌ఈ అధికారిపై ఫోన్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అణగారిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం చివరివరకు పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ భాజపా ఇంఛార్జి సింగాయపల్లి గోపి, కౌన్సిలర్‌ సునీతా బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సాగర్ ఉపపోరు: నాలుగు రోజుల్లో 20మంది.. 23 నామినేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.