మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మదన్రెడ్డి పర్యటించారు. ముందుగా నర్సాపూర్లో పర్యటించిన ఆయన.. పురపాలిక సాధారణ సమావేశంలో పాల్గొన్నారు. పట్టణంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
అనంతరం నర్సాపూర్ మండలం కాగజ్మద్దూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన డంపింగ్యార్డును ప్రారంభించారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని సూచించారు. పారిశుద్ధ్యంపై గ్రామస్థులకు మరింత అవగాహన కల్పించాలని తెలిపారు.
ఇదీచూడండి: అర్హులైన రైతులందరికీ రైతుబంధు సొమ్ము: నిరంజన్రెడ్డి