మానసిక ప్రశాంతతో పాటు ఒత్తిడి నుండి బయటపడేందుకు యోగ మంచి ఫలితాలను ఇస్తుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా జిల్లా హవేలి ఘనపూర్లో నిర్వహిస్తున్న రెండు రోజుల యోగ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతీచోట ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారన్న ఆయన ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని అధికారులు ఈ యోగ శిక్షణకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు వచ్చారు. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి రమణ ఆశ్రమం నుంచి సాగర్ సింధూరి వచ్చారు. శిక్షణ తరగతుల్లో దాదాపుగా 300 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.