'ఆజాది కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 24న ఉదయం ఆరున్నరకు 'ఫ్రీడం రన్' నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల్లో.. దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలు 75 వారాల పాటు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా జరుపనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఫ్రీడం రన్ ఏర్పాటు చేశామన్నారు. అధికారులు తమ సిబ్బందితో సహా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: పోలీస్ క్యాంపస్లో కల్యాణ మండపానికి డీజీపీ భూమిపూజ