మెదక్ జిల్లా నర్సాపూర్లోని సునీతా లక్ష్మారెడ్డి కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. సీఐ నాగయ్య నేతృత్వంలో ఐదుగురు ఎస్ఐలు, 50 మంది పోలీసుల బృందం తనిఖీల్లో పాల్గొన్నారు.
సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ప్రజలు అప్రమత్తమై వెంటనే సమాచారం తెలియజేయాలని సీఐ నాగయ్య సూచించారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ