ETV Bharat / state

చికిత్సపొందుతూ కరోనాతో మహిళ మృతి

author img

By

Published : Aug 1, 2020, 2:27 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందింది. అంత్యక్రియలు కూడా భాగ్యనగరంలోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

corona patient died in narsapur
చికిత్సపొందుతూ కరోనాతో మహిళ మృతి

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా... పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్​గా తేల్చారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలని కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అక్కడే చికిత్స పొందుతూ శనివారం ఉదయం మహిళ మృతి చెందింది. అంత్యక్రియలు కూడా హైదరాబాద్​లోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా మృతితో పట్టణంలోని అన్ని వార్డులలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు అధికారులు.

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా... పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్​గా తేల్చారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలని కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అక్కడే చికిత్స పొందుతూ శనివారం ఉదయం మహిళ మృతి చెందింది. అంత్యక్రియలు కూడా హైదరాబాద్​లోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా మృతితో పట్టణంలోని అన్ని వార్డులలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు అధికారులు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.