మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచలో దారుణం జరిగింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లికి చెందిన ఓ మహిళ(45) నర్సాపూర్లో దినసరి కూలీగా పని చేస్తోంది. శనివారం నాడు ఉదయం పని కోసం నర్సాపూర్కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అవంచ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న కాలువ వద్ద ఆమెపై అత్యాచారం చేసి చీర కొంగుతో ఉరి వేసి హత్య చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు, డాగ్ స్కాడ్తో పరిశీలించారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ నాగయ్య తెలిపారు.
ఇవీ చూడండి: వికారాబాద్లో మైనర్బాలికపై అత్యాచారం