జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ఐపీఓ విధానాన్ని రద్దు చేసి, వేతన సవరణ వెంటనే అమలు చేయాలని ఆ సంస్థ అధికారులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీమా రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ సంస్థల లాభార్జన కోసమే ఐపీఓ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగులకు తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు. వేతన సవరణలో జాప్యం చేస్తుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచించుకొని ఎల్ఐసీ మనుగడను కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి: 'పేదలకు కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందించేందుకు సంస్కరణలు'