ETV Bharat / state

రైతు సమస్యకు గంటల్లోనే పరిష్కారం

సామాన్య ప్రజానికం ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా కష్టమైన పని. కానీ... ముఖ్యమంత్రే మనకు ఫోన్​ చేసి నీ సమస్యేంటీ... బాధపడకు... నేనున్నా అంటూ భరోసా ఇస్తే... అంతకన్నా అదృష్టముంటుందా...! సమస్య తెలుసుకోవటమే కాదు గంటల్లోనే పరిష్కరించారు కూడా. అలాంటి అరుదైన సంఘటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి రైతు బంధు సీఎం అంటూ నిరూపించుకున్నారు.

author img

By

Published : Mar 27, 2019, 8:11 PM IST

Updated : Mar 27, 2019, 8:38 PM IST

యువకులకు సీఎం భరోసా...
యువకులకు సీఎం భరోసా...
మంచిర్యాల జిల్లా నెన్నెల్‌ మండలం నందులపల్లికి చెందిన యువ రైతు శరత్‌కు.. ముఖ్యమంత్రి కేసీఆర్​ స్వయంగా ఫోన్‌ చేశారు. ముఖ్యమంత్రేంటీ... సామాన్య రైతుకు ఫోన్​ చేయటమేంటీ అని ఆశ్చర్యంగా ఉందా...! అయితే విషయంలోకి వెళ్లాల్సిందే...!

యువరైతు బాధపడితే....

రైతుల సమస్యలకు పరిష్కారాలిస్తూ... సరికొత్త విధానాలను పరిచయం చేస్తూ... ఫేస్​బుక్​లో ఓ పేజీని నడుపుతున్నాడు యువ రైతు శరత్​. కానీ ఓ రోజు తన సమస్యనే వీడియో రూపంలో సీఎంకి చేరువ చేయండంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమికి సంబంధించి ఉన్న సమస్యను, దానికి గ్రామ అధికారులు వ్యవహరించిన తీరును వీడియోలో వివరించాడు.

ముఖ్యమంత్రే ఫోన్​ చేశారు...

వీడియో పెట్టిన పది రోజులకు అనూహ్యంగా... శరత్​... నేను సీఎంని మాట్లాడుతున్నా.... మీ సమస్యేంటీ...? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఫోన్​ చేసి మాట్లాడారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. బాధితుని గోడును సావదానంగా విన్న సీఎం... న్యాయం చేస్తామని అభయమిచ్చారు.

సీఎంతో ఆవేదన చెప్పుకున్నాడు...

తాతల నాటి నుంచి వస్తున్న తమ జీవనాధార భూమిని వేరొకరు అప్పనంగా పట్టా చేసుకున్నారని శరత్​ కుంటుంబసభ్యులు ఆరోపించారు. తహసీల్దార్‌, సబ్‌ కలెక్టర్లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... సమస్య తీరట్లేదని ఆవేదన చెందాడు. రైతులకు న్యాయం చేసే సీఎంకి ఎలాగైనా తమ ఆవేదన తెలియపర్చాలని తన పేజీలో పోస్టు పెట్టానని శరత్​ తెలిపాడు.

గంటల్లోనే సమస్య పరిష్కారం...

ఫోన్​ చేసిన గంటలోనే శరత్​ ఇంటికి మంచిర్యాల కలెక్టర్‌ హోళికేరి అధికారులతో కలిసి వచ్చారు. సమస్యపై విచారణ జరిపారు. వెంటనే పరిష్కరించటమే కాకుండా ఇప్పటివరకూ రాని రైతుబంధు పథకం డబ్బులు కూడా ఇప్పించారు. దీనంతటికీ కారణమైన వీఆర్వోను కూడా అధికారులు సస్పెండ్​ చేశారు.

యువకులకు సీఎం పిలుపు...

సమస్య తీరగానే చల్లబడకుండా రాష్ట్రంలోని తనబోటి యువకులను చైతన్యపరచాలని సీఎం శరత్​కు సూచించారు. ప్రభుత్వం రైతులకు మంచి చేసే పనులు చేసినప్పుడు బాసటగా నిలవాలని పిలుపునివ్వటం యువకుల్లో ఉత్సాహం నింపింది.

ఇవీ చూడండి:శరత్​... నేను కేసీఆర్​ను మాట్లాడుతున్నా...!

యువకులకు సీఎం భరోసా...
మంచిర్యాల జిల్లా నెన్నెల్‌ మండలం నందులపల్లికి చెందిన యువ రైతు శరత్‌కు.. ముఖ్యమంత్రి కేసీఆర్​ స్వయంగా ఫోన్‌ చేశారు. ముఖ్యమంత్రేంటీ... సామాన్య రైతుకు ఫోన్​ చేయటమేంటీ అని ఆశ్చర్యంగా ఉందా...! అయితే విషయంలోకి వెళ్లాల్సిందే...!

యువరైతు బాధపడితే....

రైతుల సమస్యలకు పరిష్కారాలిస్తూ... సరికొత్త విధానాలను పరిచయం చేస్తూ... ఫేస్​బుక్​లో ఓ పేజీని నడుపుతున్నాడు యువ రైతు శరత్​. కానీ ఓ రోజు తన సమస్యనే వీడియో రూపంలో సీఎంకి చేరువ చేయండంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమికి సంబంధించి ఉన్న సమస్యను, దానికి గ్రామ అధికారులు వ్యవహరించిన తీరును వీడియోలో వివరించాడు.

ముఖ్యమంత్రే ఫోన్​ చేశారు...

వీడియో పెట్టిన పది రోజులకు అనూహ్యంగా... శరత్​... నేను సీఎంని మాట్లాడుతున్నా.... మీ సమస్యేంటీ...? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఫోన్​ చేసి మాట్లాడారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. బాధితుని గోడును సావదానంగా విన్న సీఎం... న్యాయం చేస్తామని అభయమిచ్చారు.

సీఎంతో ఆవేదన చెప్పుకున్నాడు...

తాతల నాటి నుంచి వస్తున్న తమ జీవనాధార భూమిని వేరొకరు అప్పనంగా పట్టా చేసుకున్నారని శరత్​ కుంటుంబసభ్యులు ఆరోపించారు. తహసీల్దార్‌, సబ్‌ కలెక్టర్లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... సమస్య తీరట్లేదని ఆవేదన చెందాడు. రైతులకు న్యాయం చేసే సీఎంకి ఎలాగైనా తమ ఆవేదన తెలియపర్చాలని తన పేజీలో పోస్టు పెట్టానని శరత్​ తెలిపాడు.

గంటల్లోనే సమస్య పరిష్కారం...

ఫోన్​ చేసిన గంటలోనే శరత్​ ఇంటికి మంచిర్యాల కలెక్టర్‌ హోళికేరి అధికారులతో కలిసి వచ్చారు. సమస్యపై విచారణ జరిపారు. వెంటనే పరిష్కరించటమే కాకుండా ఇప్పటివరకూ రాని రైతుబంధు పథకం డబ్బులు కూడా ఇప్పించారు. దీనంతటికీ కారణమైన వీఆర్వోను కూడా అధికారులు సస్పెండ్​ చేశారు.

యువకులకు సీఎం పిలుపు...

సమస్య తీరగానే చల్లబడకుండా రాష్ట్రంలోని తనబోటి యువకులను చైతన్యపరచాలని సీఎం శరత్​కు సూచించారు. ప్రభుత్వం రైతులకు మంచి చేసే పనులు చేసినప్పుడు బాసటగా నిలవాలని పిలుపునివ్వటం యువకుల్లో ఉత్సాహం నింపింది.

ఇవీ చూడండి:శరత్​... నేను కేసీఆర్​ను మాట్లాడుతున్నా...!

Intro:tg_adb_10a_27_etv_vote_awarness_pkg_c5


Body:5


Conclusion:6

Last Updated : Mar 27, 2019, 8:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.