ETV Bharat / state

సింగరేణిలో కరోనా సైరన్​.. పెరుగుతోన్న కేసులు

author img

By

Published : Aug 13, 2020, 10:48 PM IST

మంచిర్యాల జిల్లా సింగరేణి కార్మిక క్షేత్రంలో కొవిడ్​ బాధితులు పెరుగుతున్నారు. గురువారం 198 మంది అనుమానితులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. 62 మందికి పాజిటివ్​ వచ్చింది. ఈ తరుణంలో తోటి కార్మికులు భయాందోళన చెందుతున్నారు.

Corona siren in Singareni increasing cases at mancherial
సింగరేణిలో కరోనా సైరన్​..పెరుగుతోన్న కేసులు

సింగరేణిలో కరోనా ప్రమాద ఘంటికలు మోగాయి. మంచిర్యాల జిల్లా సింగరేణి కార్మిక క్షేత్రంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మందమర్రి పరిధి రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఈరోజు 198 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. వారిలో 62 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కార్మికలోకం భయాందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా ఇదే స్థాయిలో పాజిటివ్ కేసులు రావడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈరోజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్మికులు కరోనా పరీక్షలు చేసుకునేందుకు పోటీపడ్డారు.

సింగరేణిలో కరోనా ప్రమాద ఘంటికలు మోగాయి. మంచిర్యాల జిల్లా సింగరేణి కార్మిక క్షేత్రంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మందమర్రి పరిధి రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఈరోజు 198 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. వారిలో 62 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కార్మికలోకం భయాందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా ఇదే స్థాయిలో పాజిటివ్ కేసులు రావడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈరోజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్మికులు కరోనా పరీక్షలు చేసుకునేందుకు పోటీపడ్డారు.

ఇదీ చూడండి : చైనాకు వ్యతిరేకంగా పీఓకేలో భారీ కాగడాల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.